ఐదేళ్లుగా సంతకాలు.. షాక్ అయి విముక్తి కల్పించిన న్యాయమూర్తి
కోర్టు విధించిన నిబంధనను గత ఐదు సంవత్సరాలుగా ఇద్దరు నిందితులు తూచా తప్పకుండా అనుసరిస్తూండటంతో.. షాక్ అయిన న్యాయమూర్తి వారికి విముక్తి కల్పించారు. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని సేలం జగత్తు వనపట్టిలో 2015లో ఆక్రమన తొలగింపు వివాదానికి..
కోర్టు విధించిన నిబంధనను గత ఐదు సంవత్సరాలుగా ఇద్దరు నిందితులు తూచా తప్పకుండా అనుసరిస్తూండటంతో.. షాక్ అయిన న్యాయమూర్తి వారికి విముక్తి కల్పించారు. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని సేలం జగత్తు వనపట్టిలో 2015లో ఆక్రమన తొలగింపు వివాదానికి దారి తీశాయి. రెవెన్యూ అధికారుల్ని అడ్డుకున్నట్లు, వాహనాలపై దాడులు చేసినట్టు మణి, పళని అనే ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలతో కూడిన బెయిల్పై అదే ఏడాదిలో మేలో వీరు బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ గత ఐదేళ్లుగా వీరు కోర్టు నిబంధనల్ని అనుసరిస్తూనే ఉన్నారు. ఇందులో నుంచి విముక్తి కోసం ఆ ఇద్దరు ఎదురుచూస్తున్నారు. అయితే వీరిద్దరి పరిస్థితిని గమనించిన విజయేంద్రన్ అనే వ్యక్తి గుర్తించారు. వారికి విముక్తి కల్పించడం కోసం కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ హైకోర్టు బెంచ్ ముందు విచారణకు వచ్చింది. ఆ ఇద్దరు కోర్టు నిబంధల్ని పాటించడ చూసి న్యాయమూర్తి షాక్ అయి.. తక్షణమే వారికి విముక్తి కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Read More:
బ్రేకింగ్ః గాంధీ ఆస్పత్రి నుంచి నలుగురు ఖైదీలు పరారీ
మధర్ థెరిస్సా మాటలను గుర్తు చేసిన చిరు
మొత్తానికి ‘బీబీ’ అంటే ఏంటో క్లారిటీ ఇచ్చిన నందు
జగనన్న విద్యాకానుక: విద్యార్థులకు ఇచ్చే స్కూల్ బ్యాగ్స్ ఇవే