కాంచీపురంలో మరో దారుణం.. అత్యాచారం చేసి ఉరితీసిన..!
ఇటు ఒక పక్క హైదరాబాద్లో యువ వైద్యురాలు మర్డర్ కేసు పెద్ద దుమారం సృష్టించగా.. కాంచీపురంలో మరో దారుణం చోటుచేసుకుంది. 20 ఏళ్లున్న రోజా అనే యువతి.. అనుమానాస్పద స్థితిలో.. ఓ ప్రైవేట్ స్థలంలో.. ఉరికొయ్యకు వేలాడుతూ కనిపించింది. స్థానికుల సమచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. యువతిని.. అత్యాచారం చేసి.. హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ కేసుపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. రోజా.. చివరిసారిగా.. రాజేష్ అనే స్నేహితుడితో కనిపించినట్లు.. ఆమె తండ్రి […]
ఇటు ఒక పక్క హైదరాబాద్లో యువ వైద్యురాలు మర్డర్ కేసు పెద్ద దుమారం సృష్టించగా.. కాంచీపురంలో మరో దారుణం చోటుచేసుకుంది. 20 ఏళ్లున్న రోజా అనే యువతి.. అనుమానాస్పద స్థితిలో.. ఓ ప్రైవేట్ స్థలంలో.. ఉరికొయ్యకు వేలాడుతూ కనిపించింది. స్థానికుల సమచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. యువతిని.. అత్యాచారం చేసి.. హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ కేసుపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. రోజా.. చివరిసారిగా.. రాజేష్ అనే స్నేహితుడితో కనిపించినట్లు.. ఆమె తండ్రి చెప్పాడు. ఒకవేళ రాజేషే చంపి ఉండవచ్చని.. పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అత్యంత కర్కశంగా.. కత్తిగాట్లతో.. ఒళ్లంతా గాయాలతో.. రోజా ఉన్న పరిస్థితిని గమనిస్తే.. ఆమెను ఎన్ని చిత్ర హింసలు పెట్టి చంపారో అర్థమవుతోంది. ఈ సంఘటన.. కాంచీపురం వ్యాప్తంగా.. భగ్గుమంటోంది. అత్యంత అమానుషంగా.. హత్యలకు పాల్పడుతున్న వారిని ఉరితీయాలంటూ.. స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దేశంలో మహిళలకు భద్రత లేకుండా పోతోందంటూ.. మండిపడుతున్నారు. కాగా.. వీరిద్దరి పేరు మీద.. ట్విట్టర్లో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.
#JusticeForRoja#JusticeForPriyankaReddy pic.twitter.com/24wZrHuNLY
— Sanjay Kumar (@sanchitsanjay08) November 29, 2019