కాంగ్రెస్ ‘ప్రక్షాళన’, సోనియా గాంధీకి సీనియర్ నేతలు సుదీర్ఘ లేఖ
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పార్టీని వెంటనే ప్రక్షాళన చేయాలని కోరుతూ 23 మంది సీనియర్ నేతలు అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. పార్టీలో సరికొత్త మార్పులు..
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పార్టీని వెంటనే ప్రక్షాళన చేయాలని కోరుతూ 23 మంది సీనియర్ నేతలు అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. పార్టీలో సరికొత్త మార్పులు చేయవలసిన అవసరం ఉందన్నారు. సోమవారం జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో వీరు లేవనెత్తిన అన్ని అంశాలపైనా సుదీర్ఘమైన చర్చ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. సీడబ్ల్యూసీ ని తిరిగి ఎన్నుకోవాలని, బాధ్యతాయుతమైన సమిష్టి నాయకత్వం అవసరమని వీరు పేర్కొన్నారు. రాహుల్ తిరిగి అధ్యక్షుడయ్యేందుకు విముఖత చూపుతున్నందున,,సీనియర్ నేతలైన మన్మోహన్ సింగ్ లేక ఏకే ఆంటోనీ వంటివారిని అధ్యక్ష పదవికి ఎన్నుకోవాలని కొందరు సూచించారు.
గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, మనీష్ తివారి వంటి ప్రముఖులు ఈ లేఖపై సంతకాలు చేశారు. రెండువారాల క్రితమే వీరు ఈ లేఖ రాసినప్పటికీ తాజాగా ఇది విడుదలైంది.