టీవీ9 బ్రేకింగ్ ప్లేట్ మార్ఫింగ్.. విద్యార్థుల్లో అలజడికి కుట్ర
టీవీ9 బ్రేకింగ్ ప్లేట్ను మార్పింగ్ చేసి కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ విద్యార్థుల్లో అలజడికి కుట్ర చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైన టీవీ9 యాజమాన్యం.. పీఎస్లో ఫిర్యాదు చేసింది. కాగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తెలంగాణాలోని విద్యాసంస్థలకు ఈ నెల 19 వరకు సెలవులను పొడిగించగా.. టీవీ9 బ్రేకింగ్ ప్లేట్ను ఉపయోగించిన కొందరు సెలవులు ఈ నెల 31వరకు పెంపు అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకునేందుకు […]
టీవీ9 బ్రేకింగ్ ప్లేట్ను మార్పింగ్ చేసి కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ విద్యార్థుల్లో అలజడికి కుట్ర చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైన టీవీ9 యాజమాన్యం.. పీఎస్లో ఫిర్యాదు చేసింది. కాగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తెలంగాణాలోని విద్యాసంస్థలకు ఈ నెల 19 వరకు సెలవులను పొడిగించగా.. టీవీ9 బ్రేకింగ్ ప్లేట్ను ఉపయోగించిన కొందరు సెలవులు ఈ నెల 31వరకు పెంపు అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకునేందుకు యాజమాన్యం సిద్ధమైంది. ఇక ఈ నెల 21న తెలంగాణాలోని విద్యాసంస్థలు పున: ప్రారంభం కానున్నాయి.