‘దిశ’ కేసు నిందితులు జైల్లో ఏం చేస్తున్నారు..? టీవీ9 ఎక్స్‌క్లూజీవ్

తెలంగాణలో ‘దిశ’పై  దారుణ హత్యాచారం ఘటనపై దేశమంతా ప్రకంపనలు రేగుతోన్న విషయం తెలిసిందే. నలుగురు మృగాళ్లను ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉంచారు. వారి రిమాండ్ విషయం ఈ రోజు స్పష్టత రానుంది. కాగా నిందితులు జైల్లో ఏం చేస్తున్నారు. మానసిక ప్రవర్తన ఎలా ఉంది?. ఇటువంటి అంశాలపై టీవీ9 ఆరా తీసింది. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో చర్లపల్లి జైలు చుట్టూ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. జైలు చుట్టుపక్కల ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు.  మహానది […]

'దిశ' కేసు నిందితులు జైల్లో ఏం చేస్తున్నారు..? టీవీ9 ఎక్స్‌క్లూజీవ్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 03, 2019 | 5:04 PM

తెలంగాణలో ‘దిశ’పై  దారుణ హత్యాచారం ఘటనపై దేశమంతా ప్రకంపనలు రేగుతోన్న విషయం తెలిసిందే. నలుగురు మృగాళ్లను ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉంచారు. వారి రిమాండ్ విషయం ఈ రోజు స్పష్టత రానుంది. కాగా నిందితులు జైల్లో ఏం చేస్తున్నారు. మానసిక ప్రవర్తన ఎలా ఉంది?. ఇటువంటి అంశాలపై టీవీ9 ఆరా తీసింది.

తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో చర్లపల్లి జైలు చుట్టూ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. జైలు చుట్టుపక్కల ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు.  మహానది బ్యారక్‌లో ఒక్కొక్కరిని ఒక్కో సెల్‌లో ఉంచారు. ఏ ఇద్దరూ మాట్లాడుకోకుండా పక్కాగా ప్రణాళిక చేశారు జైలు సిబ్బంది. వారి ఆరోగ్య పరిస్థితులను గంటకోసారి సమీక్షిస్తున్నారు. వేరే ఖైదీలెవరూ వారిపై దాడులకు యత్నించకుండా, వారిని కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సీసీ కెమెరాల ద్వారా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సిట్యువేషన్స్‌ని మానిటర్ చేస్తున్నారు. ప్రహారి చుట్టూ కూడా భద్రతను రెట్టింపు చేసినట్టు తెలుస్తోంది. మల్కాజిగిరి డీసీపీ రక్షిత కె.మూర్తి ఎప్పటికప్పుడు జైలు అధికారులతో సమీక్ష జరుపుతున్నారు. మొదటి రోజు  నిద్రపోకపోయినా, తర్వాత రోజు నుంచి అందరు ఖైదీల్లానే వారు టైంకి ఆహారం తింటూ..నిద్రపోతున్నారట. ఎటువంటి పశ్చాత్తాపం నిందితుల్లో కనిపించనట్టు సమాచారం.