వేధింపులపై కాల్ సెంటర్?..సై అన్న వైసీపీ : ‘బిగ్ న్యూస్-బిగ్ డిబేట్’
టీడీపీ, వైసీపీ మధ్య మాటలయుద్ధం కొత్త మలుపు తిరిగింది. తమ పార్టీకి చెందిన 14 మంది కార్యకర్తలను చంపేశారనీ, 700 పైచిలుకు కేసులు పెట్టారని టీడీపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. చంద్రబాబు ప్రభుత్వం నియమించిన వైస్ చాన్సలర్లు, రెక్టార్లపై దాడులు చేస్తూ కేసులు పెడుతున్నారని టీడీపీ నేతలు ఏపీ గవర్న్కి ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య వ్యక్తిగత దూషణల రాజకీయం నడుస్తోంది. ఈ ఇష్యూపై టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్ ఆధ్వర్యంలో బిగ్ […]
టీడీపీ, వైసీపీ మధ్య మాటలయుద్ధం కొత్త మలుపు తిరిగింది. తమ పార్టీకి చెందిన 14 మంది కార్యకర్తలను చంపేశారనీ, 700 పైచిలుకు కేసులు పెట్టారని టీడీపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. చంద్రబాబు ప్రభుత్వం నియమించిన వైస్ చాన్సలర్లు, రెక్టార్లపై దాడులు చేస్తూ కేసులు పెడుతున్నారని టీడీపీ నేతలు ఏపీ గవర్న్కి ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య వ్యక్తిగత దూషణల రాజకీయం నడుస్తోంది. ఈ ఇష్యూపై టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్ ఆధ్వర్యంలో బిగ్ న్యూస్-బిగ్ డిబేట్ వేదికగా కీలక చర్చ జరిగింది.
పోలీసుల వేధింపులు, కేసులపైనా థర్డ్పార్టీ కాల్సెంటర్ ఏర్పాటుకు సిద్ధమా అని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్రెడ్డి- TV9 బిగ్న్యూస్ బిగ్ డిబేట్లో సవాల్ విసిరారు. ఈ సవాల్ని స్వీకరిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి ప్రకటించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై కూడా ఇద్దరు నేతలు ఛాలెంజ్లు విసురుకున్నారు.