లాక్డౌన్ కష్టాలు.. ఆర్థిక ఇబ్బందులతో ప్రముఖ నటుడు ఆత్మహత్య..!
కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా చాలా మంది తమ ఉపాధిని కోల్పోయిన విషయం తెలిసిందే. వారిలో సినిమా రంగం వారు కూడా ఉన్నారు.
కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా చాలా మంది తమ ఉపాధిని కోల్పోయిన విషయం తెలిసిందే. వారిలో సినిమా రంగం వారు కూడా ఉన్నారు. షూటింగ్లకు బ్రేక్ పడటంతో చాలా మంది నటీనటులు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఓ నటి తన వద్ద డబ్బులు లేక మేకప్ మ్యాన్ దగ్గ అప్పు చేశానని సోషల్ మీడియాలో వెల్లడించింది. ఇక చాలా మంది కారెక్టర్ ఆర్టిస్ట్ల పరిస్థితి అలానే ఉంది. అయితే లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందుల వలన ఓ నటుడు తాజాగా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రముఖ హిందీ నటుడు, పంజాబీ పాత్రల్లో నటించిన మన్మీత్ గైవాల్ శుక్రవారం రాత్రి ముంబైలోని తన స్వగృహంలో ఆత్మహత్య చేసుకున్నాడు. పంజాబ్కు చెందిన అతడు ముంబయిలోని ఖర్గార్లో తన భార్యతో కలిసి నివసిస్తున్నాడు. షూటింగ్లు లేకపోవడంతో అతడిని ఆర్థిక నష్టాలు వెంబడించాయి. దీంతో వేరే దారి లేక ఆత్మహత్య చేసుకొని తనువు చాలించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. అయితే అదత్ సే మజ్బూర్, కుల్దీపాక్ వంటి సీరియల్స్లో నటించిన మన్వీత్.. వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపించాడు. ఈ మధ్యే కొన్ని వెబ్ సిరీస్లకు సైన్ చేయగా.. లాక్డౌన్ వలన ఆ ప్రాజెక్ట్లు ఇంకా పట్టాలెక్కలేదు.
Read This Story Also: మాస్రాజా సినిమాలో మెగా హీరో అతిథి పాత్ర..!