Breaking: క్యాన్సర్తో యువ నటి మృతి.. కన్నీళ్లు పెట్టిస్తోన్న చివరి పోస్ట్
ప్రముఖ టీవీ నటి, మిస్ యూనివర్స్ కంటెస్టెంట్(2011) దివ్యా చౌక్సీ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా క్యాన్సర్తో బాధపడుతున్న ఈ నటి చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు.
ప్రముఖ టీవీ నటి, మిస్ యూనివర్స్ కంటెస్టెంట్(2011) దివ్యా చౌక్సీ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా క్యాన్సర్తో బాధపడుతున్న ఈ నటి చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. దివ్యా మరణ వార్తను ఆమె కజిన్ సౌమ్య అమిష్ వర్మ సోషల్ మీడియాలో వెల్లడించారు.
కాగా చనిపోయే గంటల ముందు దివ్య తన ఇన్స్టాలో ఓ స్టోరీని పోస్ట్ చేశారు. అందులో.. నేను చెప్పాలనుకున్న విషయాన్ని తెలపడానికి మాటలు రావడం లేదు. గత కొన్ని నెలలుగా నేను మెసేజ్లకు దూరంగా ఉంటున్నా. మీకు చెప్పేందుకు ఇదే సరైన సమయం. నేను నా డెత్ బెడ్ మీద ఉన్నా. ఏమైనా జరగొచ్చు. అయినా నేను స్ట్రాంగ్గా ఉన్నా. మరో జన్మ ఉంటే ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని కోరుకుంటున్నా. నన్ను ఏం ప్రశ్నించకండి ప్లీజ్. మీరంటే నాకు ఎంత ఇష్టమే కేవలం దేవుడికి మాత్రమే తెలుసు అని కామెంట్ పెట్టారు. మరోవైపు ఆమె మరణంపై సహనటులు నిన్ను మిస్ అవుతాం. నీ ఆత్మకు శాంతి కలగాలి అని సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా హై అప్నా దిల్ తో ఆవారా అనే చిత్రంలో నటించిన దివ్యా.. బుల్లితెరపైన పలు సీరియల్స్లో మెరిసింది. కాగా ఇప్పటికే పలువురి మృతితో తీవ్ర విషాదంలో ఉన్న బాలీవుడ్కి దివ్యా మరణం మరింత శోకాన్ని మిగిల్చింది.