టర్కీ విద్యా సంస్థల్లో భారత వ్యతిరేక ప్రచారాలు
భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ చేస్తున్న ప్రచారాలు, పన్నుతున్న ఎత్తుగడలకు టర్కీ కూడా సహకరిస్తోంది. జమ్మూ కాశ్మీర్ కు స్వయం నిర్ణయాధికారాన్ని కల్పించేందుకు ఉద్దేశించిన 370 అధికరణాన్ని కేంద్రం గత ఏడాది ఆగస్టు 5 న రద్దు చేయగా పాకిస్తాన్ తీవ్రంగా వ్యతిరేకించింది.
భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ చేస్తున్న ప్రచారాలు, పన్నుతున్న ఎత్తుగడలకు టర్కీ కూడా సహకరిస్తోంది. జమ్మూ కాశ్మీర్ కు స్వయం నిర్ణయాధికారాన్ని కల్పించేందుకు ఉద్దేశించిన 370 అధికరణాన్ని కేంద్రం గత ఏడాది ఆగస్టు 5 న రద్దు చేయగా పాకిస్తాన్ తీవ్రంగా వ్యతిరేకించింది. దీనికి టర్కీ అధ్యక్షుడు రిసెప్ ఎర్డోగాన్ కూడా ఆ దేశానికి వంత పాడారు. గత సంవత్సరం సెప్టెంబరులో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో టర్కీ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. ఇస్లామిక్ ప్రపంచ దేశాలకు తనను అత్యున్నత నేతగా ప్రకటించుకోవడానికి తహతహలాడుతున్న ఎర్డోగాన్ కి పాక్ కూడా సపోర్ట్ ప్రకటిస్తుండడంతో.. రెండు దేశాలూ ‘జిగ్రీ దోస్తులు’గా మారిపోయాయి.
టర్కీ యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో ఏడాది కాలంగా భారత వ్యతిరేక ప్రచారాల జోరు హెచ్చింది. కాశ్మీర్ అంశంపై వరుసగా చిన్న, పెద్ద స్థాయి కాన్ఫరెన్సులు, సెమినార్లను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు టర్కీలో పాక్ రాయబారి సైరస్ సజ్జాద్ క్వాజీ కూడా పిలవని పేరంటంగా హాజరవుతున్నారు. ఇక ఇందుకు పాకిస్థాన్ ఐ ఎస్ ఐ సైతం తానూ మద్దతునిస్తోంది.