తుమ్మలకేమైంది ? ఉన్నట్లుండి దూకుడెందుకు ?

మొన్నటిదాకా ఆయన సైలెంట్‌గా ఉన్నారు. కానీ సడెన్‌గా ఒక్కసారిగా స్పీడ్‌ పెంచేశారు. జిల్లా మొత్తం సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. నిన్నటి వరకు కామ్ గా ఉన్న ఆ నేత స్పీడ్ పెంచడం వెనుక కారణం ఏమిటి? ఆయనకు కీలక పదవి ఏమైనా రాబోతుందా? ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు మార్పు కనిపిస్తోంది. ఇన్నాళ్లు సీనియర్‌ నేతల రాజ్యం నడిస్తే….ఇప్పుడు జూనియర్ల సీజన్‌ మొదలైంది. జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ శకం ఉమ్మడి జిల్లాలో ప్రారంభమైంది. అయితే మూడు […]

తుమ్మలకేమైంది ? ఉన్నట్లుండి దూకుడెందుకు ?
Follow us

|

Updated on: Oct 30, 2019 | 7:55 PM

మొన్నటిదాకా ఆయన సైలెంట్‌గా ఉన్నారు. కానీ సడెన్‌గా ఒక్కసారిగా స్పీడ్‌ పెంచేశారు. జిల్లా మొత్తం సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. నిన్నటి వరకు కామ్ గా ఉన్న ఆ నేత స్పీడ్ పెంచడం వెనుక కారణం ఏమిటి? ఆయనకు కీలక పదవి ఏమైనా రాబోతుందా? ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు మార్పు కనిపిస్తోంది. ఇన్నాళ్లు సీనియర్‌ నేతల రాజ్యం నడిస్తే….ఇప్పుడు జూనియర్ల సీజన్‌ మొదలైంది.
జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ శకం ఉమ్మడి జిల్లాలో ప్రారంభమైంది. అయితే మూడు దశబ్దాల పాటు రాజకీయాల్లో కీలకంగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇప్పుడు యాక్టివ్‌ అయ్యారు. ఈయన సడెన్‌గా ఖమ్మం పొలిటికల్‌ స్కీన్‌పైకి రావడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయింది.
సత్తుపల్లి, ఖమ్మం, పాలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తుమ్మల…పలుసార్లు మంత్రిగా పనిచేశారు. జిల్లా అభివృద్ధికి కృషి చేశారు. ఇటీవల ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.  ఆ తర్వాత  కార్యకర్తలకు దూరం అయ్యారు. నియోజకవర్గాన్ని వదిలివేశారు.  ఇదే టైమ్‌లో పాలేరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరిపోయారు. దీంతో ఇక పాలేరు వైపు తుమ్మల కన్నెత్తి చూడలేదు. సభ్యత్వ సేకరణ సమయంలో మాత్రమే వచ్చి పోయారు. అడపా దడపా చిన్న చిన్న ప్రొగ్రామ్ లకు మాత్రమే వచ్చి పోయేవారు.  
ఇన్నాళ్లు పాలేరుకు దూరంగా ఉన్న తుమ్మల…లేటెస్ట్‌గా మళ్లీ యాక్టివ్‌ అయ్యారు.  పదిహేను రోజులుగా తుమ్మల నాగేశ్వర రావు నియోజకవర్గంలో కలియతిరుగుతున్నారు.  ఒక్కసారిగా తుమ్మల యాక్టివ్ ఎందుకు అయ్యారు అనే చర్చ మొదలైంది.
ఓటమి తర్వాత తుమ్మల దూకుడు తగ్గించారు. అయితే మంత్రి పదవి వస్తుందని అనుచరవర్గం మాత్రం ఊహలోకాల్లో విహరించింది. కానీ ఆ మంత్రి పదవి కెటిఆర్ ముఖ్య అనుచరుడు అయిన పువ్వాడ  అజయ్ ను వరించింది. అయితే పువ్వాడ మంత్రి అయిన తర్వాత  తుమ్మల మళ్లీ యాక్టివ్‌ కావడం నియోజకవర్గంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.  అయితే నిన్నటి వరకు రాజకీయాలకు దూరంగా ఉండడంతో ఆయన అనుచర వర్గం కూడ కొంత మేరకు దెబ్బ తింది. ఊగిసలాటలో ఉండిపోయింది. అయితే ఇప్పుడు తుమ్మల యాక్టివ్ గా నియోజకవర్గంలో పర్యటిస్తు ఉండడంతో మళ్లీ ఆయన వద్దకు క్యాడర్ తరలి వెళుతున్న పరిస్థితి ఉంది.
మరి ఇప్పటికే కందాల ఎంఎల్ఎ గా అటు టిఆర్ఎస్ వర్గాలను, ఇటు కాంగ్రెస్ వర్గాలను కలుపుకుని పోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాను అందరి వాడినని, తనకు వర్గ విబేధాలు లేవని చెబుతు కందాల తన రోల్ ను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల పేరిట కందాల తిరుగుతుండగా, ఇటు కర్మలు, పార్టీ నాయకుల వద్దకు వెళుతూ తుమ్మల కూడ యాక్టివ్ అయ్యారు. అయితే తుమ్మల యాక్టివ్‌ పాలిటిక్స్‌తో ఏం సిగ్నల్స్‌ పంపుతున్నారనే చర్చ నడుస్తోంది.

దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..