గల్లంతైన తులసిప్రియ మృతదేహం లభ్యం

కృష్ణా జిల్లాలోని కంచికచర్ల మండలం చెవిటికల్లులో గల్లంతైన తులసి ప్రియ మృతదేహం లభ్యమైంది. బాలిక మృతదేహన్ని ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది వెలికితీశారు. లక్ష్మయ్యవాగులోని చెట్లపొదల్లో తులసిప్రియ డెడ్‌బాడీని గుర్తించారు అధికారులు. చెవిటికల్లు వద్ద కృష్ణానదిలో శుక్రవారం పడవ బోల్తాపడి వరదలో కొట్టుకుపోయిన బాలిక విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చెవిటి కల్లుకు చెందిన రమేష్‌ తన ఇద్దరు కూతుళ్లతో నాటుపడవ ఎక్కారు..లక్ష్మయ్య వాగు దాటుతుండగా ఎదురుగా వచ్చిన గేదె పడవను ఢీకొట్టడంతో పడవ ఒక్కసారిగా […]

గల్లంతైన తులసిప్రియ మృతదేహం లభ్యం
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2020 | 8:18 PM

కృష్ణా జిల్లాలోని కంచికచర్ల మండలం చెవిటికల్లులో గల్లంతైన తులసి ప్రియ మృతదేహం లభ్యమైంది. బాలిక మృతదేహన్ని ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది వెలికితీశారు. లక్ష్మయ్యవాగులోని చెట్లపొదల్లో తులసిప్రియ డెడ్‌బాడీని గుర్తించారు అధికారులు. చెవిటికల్లు వద్ద కృష్ణానదిలో శుక్రవారం పడవ బోల్తాపడి వరదలో కొట్టుకుపోయిన బాలిక విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చెవిటి కల్లుకు చెందిన రమేష్‌ తన ఇద్దరు కూతుళ్లతో నాటుపడవ ఎక్కారు..లక్ష్మయ్య వాగు దాటుతుండగా ఎదురుగా వచ్చిన గేదె పడవను ఢీకొట్టడంతో పడవ ఒక్కసారిగా బొల్తాపడింది. దీంతో పడవలో ఉన్న ఐదుగురు ఎలాగోలా ఒడ్డున పడ్డారు. కానీ, తులసిప్రియ నీటిలో కొట్టుకు పోయింది. సమాచారం అందుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం లేకుండా పోయింది. తులసిప్రియ మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం అధికారులు నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.