మతిస్థిమితం కోల్పోయిన ఆర్టీసీ కార్మికుడు..మృతి
ఆర్టీసీ కార్మికుల ఆకలి చావులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నవంబర్ 13న మహబూబాబాద్ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ నరేష్ పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా మరో కార్మికుడు తీవ్ర మనస్తాపంతో మృత్యువాతపడ్డాడు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నవంబర్ 5వ తారీఖు డెడ్లైన్ అంటూ టీవీలో వచ్చిన ప్రభుత్వ ప్రకటనను చూస్తూ సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన ఆర్టీసీ కార్మికుడు నాగేశ్వర్ రావు మతిస్థిమితం కొల్పోయాడు. అప్పటి నుంచి నాగేశ్వర్రావు తనకు తానే నవ్వుతూ, ఏడుస్తూ […]
ఆర్టీసీ కార్మికుల ఆకలి చావులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నవంబర్ 13న మహబూబాబాద్ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ నరేష్ పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా మరో కార్మికుడు తీవ్ర మనస్తాపంతో మృత్యువాతపడ్డాడు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నవంబర్ 5వ తారీఖు డెడ్లైన్ అంటూ టీవీలో వచ్చిన ప్రభుత్వ ప్రకటనను చూస్తూ సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన ఆర్టీసీ కార్మికుడు నాగేశ్వర్ రావు మతిస్థిమితం కొల్పోయాడు. అప్పటి నుంచి నాగేశ్వర్రావు తనకు తానే నవ్వుతూ, ఏడుస్తూ ఉండిపోయాడు. నారాయణఖేడ్ డిపోలో ఆర్టీసీ కండక్టర్గా నాగేశ్వర్రావు విధులు నిర్వహిస్తున్నాడు. ప్రభుత్వ తీరుతో ఉద్యోగం పోయిందనే మనస్తాపంతో..పిచ్చివాడైపోయిన నాగేశ్వర్ రావుకు అప్పట్నుంచి హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందజేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం అతడు చికిత్స పొందుతూ మృతిచెందినట్లుగా వైద్యులు వెల్లడించారు. నాగేశ్వర్ రావు మృతితో ఆయన కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. మృతుడి స్వస్థలం ఘానాపూర్ గ్రామం కాగా, పిల్లల చదువుల కోసం గతంలో సంగారెడ్డిలో అద్దె ఇంట్లో ఉంటున్న నాగేశ్వర్రావు ఫ్యామిలీ..సమ్మె కారణంగా జీతాలు లేక, ఇంటి అద్దె కట్టలేని స్థితిలో జోగిపేటలోని అత్తవారింట్లోనే ఉంటున్నారు. కొన్ని రోజులుగా ఉద్యోగ ఆందోళనతో అనారోగ్యానికి గురైన తన తార్నాకలోని ఆర్టీసీ భీమా ఆస్పత్రికి తీసుకెళ్తే అక్కడి వైద్యులు పట్టించుకోలేదని నాగేశ్వర్రావు భార్య ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త కోలుకుంటాడని, తిరిగి ఉద్యోగంలో చేరి తమ కుటుంబం సంతోషంగా ఉంటుందని ఆశపడ్డ తమకు నిరాశే మిగిలిందని ఆ ఇల్లాలు రోధించింది. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంది.