దసరా పండుగకు టీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు
దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అదనపు బస్సులను నడుపాలని నిర్ణయించామని తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ అధికారులు తెలిపారు.
దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అదనపు బస్సులను నడుపాలని నిర్ణయించామని తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ అధికారులు తెలిపారు. ఆ మేరకు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు మూడు వేల ప్రత్యేక బస్సులు నడపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రంగారెడ్డి ఆర్ఎం వరప్రసాద్ వెల్లడించారు. హైదరాబాద్లోని మహాత్మాగాంధీ బస్స్టేషన్ తో పాటు జూబ్లీ బస్స్టేషన్ , కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, అమీర్పేట్, ఈసీఐఎల్, ఉప్పల్ రింగ్ రోడ్, ఎల్బీనగర్ ప్రాంతాల నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయని ఆయన తెలిపారు. ఈ బస్సుల్లో ప్రయాణం కోసం ప్రజలకు అడ్వాన్స్డ్ బుకింగ్ సౌకర్యం కూడా కల్పించినట్లు రంగారెడ్డి ఆర్ఎం చెప్పారు. ప్రజల భద్రతా సౌకర్యం కోసం టీఎస్ఆర్టీసీ బస్సులను మాత్రమే వినియోగించాలని ఆయన కోరారు.