ఆర్టీసీ కార్మిక సంఘాల నేతల అత్యవసర సమావేశం!
తెలంగాణ ఆర్టీసీ సంఘాల నేతలు ఎంజీబీఎస్లో అత్యవసరంగా సమావేశమయ్యారు. హైకోర్టు తీర్పు, భవిష్యత్ కార్యాచరణపై నేతలు సమాలోచనలు చేస్తున్నారు. సమ్మెపై ఐకాస నేతలు ఇవాళ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సాయంత్రం 4 గంటలకు మరోసారి సమావేశమై సమ్మెపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో నిన్న ఆర్టీసీ కార్మిక సంఘాలు వేర్వేరుగా సమావేశమై కార్మికుల అభిప్రాయాలను సేకరించి, వాటిపై సుదీర్ఘంగా చర్చించాయి. అనంతరం ఎల్బీనగర్లో అశ్వత్థామరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. సమ్మెను కొనసాగించడానికి […]
తెలంగాణ ఆర్టీసీ సంఘాల నేతలు ఎంజీబీఎస్లో అత్యవసరంగా సమావేశమయ్యారు. హైకోర్టు తీర్పు, భవిష్యత్ కార్యాచరణపై నేతలు సమాలోచనలు చేస్తున్నారు. సమ్మెపై ఐకాస నేతలు ఇవాళ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సాయంత్రం 4 గంటలకు మరోసారి సమావేశమై సమ్మెపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో నిన్న ఆర్టీసీ కార్మిక సంఘాలు వేర్వేరుగా సమావేశమై కార్మికుల అభిప్రాయాలను సేకరించి, వాటిపై సుదీర్ఘంగా చర్చించాయి. అనంతరం ఎల్బీనగర్లో అశ్వత్థామరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. సమ్మెను కొనసాగించడానికి మెజారిటీ కార్మికులు మొగ్గు చూపారని వెల్లడించారు. కార్మిక కోర్టు తీర్పునూ పరిశీలించాకే సమ్మెపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.