కర్నాటకకు బస్సులు నడిచేది ఎప్పుడంటే…
కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన అంతర్రాష్ట్ర సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు టీఎస్ ఆర్టీసీ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇప్పటికే కర్నాటకతోపాటు ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖలకు లేఖలు రాసింది. ముఖ్యంగా బెంగుళూరు, రాయిచూరుకు హైదరాబాద్ నుంచి ఎక్కువ బస్సులు నడుస్తుంటాయి. కర్నాటక రోడ్డు రవాణాశాఖ నుంచి సుముఖత వ్యక్తం కాగానే బస్సులు పునరుద్ధరించేదుకు టీఎస్ఆర్టీసీ ప్లాన్ చేస్తోంది. ఏపీతో కొన్ని సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నందున వాటిపై స్పష్టత కోసం అధికారులు వేచి చూస్తున్నారు. ఏపీ బస్సులు […]
కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన అంతర్రాష్ట్ర సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు టీఎస్ ఆర్టీసీ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇప్పటికే కర్నాటకతోపాటు ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖలకు లేఖలు రాసింది. ముఖ్యంగా బెంగుళూరు, రాయిచూరుకు హైదరాబాద్ నుంచి ఎక్కువ బస్సులు నడుస్తుంటాయి. కర్నాటక రోడ్డు రవాణాశాఖ నుంచి సుముఖత వ్యక్తం కాగానే బస్సులు పునరుద్ధరించేదుకు టీఎస్ఆర్టీసీ ప్లాన్ చేస్తోంది.
ఏపీతో కొన్ని సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నందున వాటిపై స్పష్టత కోసం అధికారులు వేచి చూస్తున్నారు. ఏపీ బస్సులు మన రాష్ట్రంలో 900కిలో మీటర్ల మేర నడుస్తుండగా తెలంగాణ సర్వీసులు 700 కిలోమీటర్ల వరకు తిరుగుతున్నాయి. రెండువైపులా సమానంగా బస్సు సర్వీసులు నడుపాలని, దీనిపై ఒప్పందం తర్వాతే సర్వీసులను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
ఇక గత రెండు రోజుల క్రితమే ఏపీఎస్ఆర్టీసీ అంతర్ రాష్ట్ర సర్వీసులను తిరిగి ప్రారంభించింది. ఈ సర్వీసులను మూడు దశలుగా పునరుద్దరిస్తున్నారు. తొలి దశలో చిత్తూరు రీజియన్ పరిధిలో 30సర్వీసులను తగిన జాగ్రత్తలను తీసుకొని నడుపుతోంది. కొన్ని జిల్లాల నుంచి కర్నాటకు బస్సు సర్వీసులను నడిపిస్తున్నారు.