భాగ్య నగరవాసులకు శుభవార్త, ప్రారంభమైన సీటీ బస్ సర్వీసులు
భాగ్య నగరవాసులకు శుభవార్త. కోవిడ్ మహమ్మారి పుణ్యామాని 185 రోజులుగా స్థంభించిపోయిన సిటీ బస్ సర్వీసులు నేటి నుండి హైదరాబాద్ లో ప్రారంభమయ్యాయి. మొత్తం సిటీ బస్సులు 3200 ఉండగా 25 శాతం బస్సులు గ్రేటర్లో తిరుగుతాయి. రాణిగంజ్ డిపోలో మొత్తం 225 సిటీ ఆర్టీసీ బస్సులు ఉండగా వాటిలో 25% అంటే 55 బస్సులు మాత్రమే రోడ్డెక్కాయి. హయత్ నగర్ డిపో 1 & 2 మరియు బండ్లగూడ డిపోల నుండి 25% బస్ లను […]
భాగ్య నగరవాసులకు శుభవార్త. కోవిడ్ మహమ్మారి పుణ్యామాని 185 రోజులుగా స్థంభించిపోయిన సిటీ బస్ సర్వీసులు నేటి నుండి హైదరాబాద్ లో ప్రారంభమయ్యాయి. మొత్తం సిటీ బస్సులు 3200 ఉండగా 25 శాతం బస్సులు గ్రేటర్లో తిరుగుతాయి. రాణిగంజ్ డిపోలో మొత్తం 225 సిటీ ఆర్టీసీ బస్సులు ఉండగా వాటిలో 25% అంటే 55 బస్సులు మాత్రమే రోడ్డెక్కాయి. హయత్ నగర్ డిపో 1 & 2 మరియు బండ్లగూడ డిపోల నుండి 25% బస్ లను ప్రయాణికులకి సేవలందించడానికి రోడ్ ఎక్కించారు. కోవిడ్ దృష్ట్యా ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్ లని పూర్తిగా సానిటైజ్ చేసినట్లుగా అధికారులు తెలిపారు.
కాగా, తెలంగాణ ప్రభుత్వం సూచనల మేరకు శానిటేషన్ చేసిన బస్సులలో సోషల్ డిస్టన్స్ ను పాటిస్తూ సర్వీసులు నడపాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. నగర శివారు గ్రామాలు, పట్టణాలకు కూడా సర్వీసులు మొదలుపెట్టాలని ఆర్టీసీ నిర్ణయానికి వచ్చింది. లాక్ డౌన్ అన్ లాక్ ప్రారంభమైనప్పటినుంచీ పేద, సామాన్య ప్రజానీకం నగరంలో ప్రయాణించేందుకు తీవ్ర ఇక్కట్లు పడుతున్న సంగతి తెలిసిందే.