సాదాసీదాగా ల‌ష్క‌ర్ బోనాలు.. ఉజ్జ‌యినీ అమ్మ‌వారికి తొలి బోనం స‌మ‌ర్పణ‌..

తెలంగాణ రాష్ట్రంలో బోనాల సంద‌డి మొద‌లైంది. ఇవాళ‌ సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జ‌యిని మ‌హంకాళి అమ్మ‌వారికి, తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ స‌తీమ‌ణి తొలి బోనం స‌మ‌ర్పించారు. ఇవాళ ఉద‌యం తెల్ల‌వారు జామున‌ ఆల‌యం బ‌య‌ట‌ పండితులకు తొలి బోనం అంద‌జేశారు తలసాని భార్య‌ స్వర్ణ. ప్ర‌తీ ఏడాది మంత్రి శ్రీనివాస్ యాదవ్ నివాసం నుండే..

సాదాసీదాగా ల‌ష్క‌ర్ బోనాలు.. ఉజ్జ‌యినీ అమ్మ‌వారికి తొలి బోనం స‌మ‌ర్పణ‌..
Follow us

| Edited By:

Updated on: Jul 12, 2020 | 9:27 AM

తెలంగాణ రాష్ట్రంలో బోనాల సంద‌డి మొద‌లైంది. ఇవాళ‌ సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జ‌యిని మ‌హంకాళి అమ్మ‌వారికి, తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ స‌తీమ‌ణి తొలి బోనం స‌మ‌ర్పించారు. ఇవాళ ఉద‌యం తెల్ల‌వారు జామున‌ ఆల‌యం బ‌య‌ట‌ పండితులకు తొలి బోనం అంద‌జేశారు తలసాని భార్య‌ స్వర్ణ. ప్ర‌తీ ఏడాది మంత్రి శ్రీనివాస్ యాదవ్ నివాసం నుండే అమ్మ వారికి తొలి బోనం సమర్పించడం ఆనవాయితీ. అలాగే ఈ ఏడాది కూడా సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జ‌యిని మ‌హంకాళి అమ్మ‌వారికి తొలి బోనం స‌మ‌ర్పించారు. కాగా క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఈ ఏడాది బోనాలు పూర్తిగా నిబంధ‌న‌ల‌తో జ‌రుగుతున్నాయి. ఈ సంవ‌త్స‌రం బోనాల జాత‌ర‌కు బ్రేక్ ప‌డింది. బోనాలు స‌ర్పించే భ‌క్తులు వారి ఇళ్ల‌ల్లో వారే బోనం చేసి స‌మ‌ర్పించుకోవాల‌ని తెలంగాణ మంత్రి త‌ల‌సాని పేర్కొన్న విష‌యం తెలిసిందే.

శుక్ర‌వారం నుంచే ఉజ్జ‌యినీ మ‌హంకాళీ ఆల‌యంలో ద‌ర్శ‌నాల‌ను అధికారులు నిలిపివేశారు. నేడు అమ్మ‌వారికి బంగారు బోనం, ప్ర‌భుత్వం త‌ర‌పున ప‌ట్టువ‌స్త్రాల్ని స‌మ‌ర్పించారు. కాగా 13వ తేదీన రంగం ఉంటుంది. కాగా ఉత్స‌వాల్ని ప్ర‌జ‌లంతా చూసేలా ఆల‌యం నుంచి ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తున్నారు. ఉద‌యం 4 గంట‌ల నుంచే ఈ లైవ్ ప్ర‌సారం అవుతుంది. భ‌క్తులు బోనం స‌ర్పించ‌డంతో పాటు, ద‌ర్శ‌నాల‌కు అనుమ‌తులు లేవు.

కాగా రాష్ట్రంలో శనివారం కొత్తగా 1,178 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఒక్కరోజే 1,714 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనాతో ఇవాళ తొమ్మిది మంది మృతిచెందారు. ఒక్క హైదరాబాద్‌లోనే 736 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తెలంగాణలో మొత్తం పాజిటవ్‌ కేసుల సంఖ్య 33,402కు చేరింది. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 348కి పెరిగింది. రాష్ట్రంలో 12,135 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కొలుకొని 20,919 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

Read More:

తెలుగు రాష్ట్రాల్లో టెర్ర‌ర్ సృష్టిస్తోన్న కరోనా.. తీవ్రంగా కేసులు న‌మోదు..

ప్ర‌ముఖ న‌టి రేఖ బంగ్లాకి సీల్..

మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
ట్రెండ్ మారింది.. అంతటా క్రెడిట్ కార్డు మహిమే.. రికార్డు స్థాయిలో
ట్రెండ్ మారింది.. అంతటా క్రెడిట్ కార్డు మహిమే.. రికార్డు స్థాయిలో