టీఎస్ కీలక కేబినెట్ భేటీ.. లాక్‌డౌన్‌ సడలింపుపై చర్చ

కేంద్రం సడలింపులు ఇచ్చినా.. అవి మాత్రం తెలంగాణలో ఉండవని తెలుస్తోంది. ఎందుకంటే సడలింపులు చేస్తే.. మళ్లీ కరోనా వైరస్ పెద్దఎత్తున వ్యాప్తి చెందే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత దాన్ని ఆపడం కష్టమని తెలంగాణ ప్రభుత్వం..

టీఎస్ కీలక కేబినెట్ భేటీ.. లాక్‌డౌన్‌ సడలింపుపై చర్చ
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Apr 19, 2020 | 5:46 PM

తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. జోన్‌ల వారీగా విభజించి కరోనా వైరస్ కట్టడికి అధికార యంత్రాంగం అహర్నిశలూ శ్రమిస్తోంది. అయితే ఇలాగే లాక్‌డౌన్ కంటిన్యూ జరిగితే.. దేశం ఆర్థిక మాంద్యంలోకి పడే ఛాన్స్ లేకపోలేదు. దీంతో కేంద్రం కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించింది. ఈ నెల 20వ తేదీ నుంచి రెడ్‌జోన్‌లు మినహా.. మిగతా అన్ని చోట్ల షరుతులతో కూడిన అనుమతులు జారీ చేసింది. అయితే ఇవన్నింటిపై ఆయా రాష్ట్రాల్లో పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవచ్చిన కేంద్రం ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రకటించింది. దీనిపై ఇవాళ మధ్యాహ్నాం 2.30 గంటలకు జరిగే కేబినెట్ భేటీలో స్పష్టత ఇవ్వనుంది. కాగా ఇప్పటికే వ్యవసాయం, దాని అనుబంధ రంగాలతో పాటు భవన నిర్మాణాలకు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులు చేశాయి.

అయితే కేంద్రం సడలింపులు ఇచ్చినా.. అవి మాత్రం తెలంగాణలో ఉండవని తెలుస్తోంది. ఎందుకంటే సడలింపులు చేస్తే.. మళ్లీ కరోనా వైరస్ పెద్దఎత్తున వ్యాప్తి చెందే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత దాన్ని ఆపడం కష్టమని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రానికి ఆదాయం రాకపోయినా పర్వాలేదు కానీ.. ముందు కరోనా సంగతి తేల్చిన తర్వాతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై దృష్టి సారించడం మేలని అనుకుంటోంది.

సడలింపులు ఇవ్వకపోవడానికి టీఎస్ సర్కార్ కారణాలు:

-ప్రస్తుతం కట్టుదిట్టంగా లాక్‌డౌన్ విధించిన తర్వాత కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అలాగే మరణాలు కూడా తగ్గడం లేదు

-సడలింపుల్ని అమలు చేస్తే.. పెద్ద సంఖ్యలో ప్రజలు బయటకు వచ్చే ఛాన్సుంది. దీంతో కరోనా వైరస్ ఒక్కసారిగా పెరిగే ప్రమాదముంది

-మరో 10 రోజుల్లో తెలంగాణ లాక్‌డౌన్ పూర్తవుతుంది. ఇన్ని రోజులు ఓపిక పట్టిన ప్రజలు.. మరో 10 రోజులు భరించగలరని తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడుతుంది

-ముఖ్యంగా పక్క రాష్ట్రం మహారాష్ట్ర నుంచి కరోనా ముప్పు మరింత పెరిగే ఛాన్ష్ ఉందనే వాదన కూడా ఉంది.

కాగా.. అటు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులపై కూడా కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. లాక్​డౌన్ కారణంగా రాష్ట్రంలో ఆదాయం భారీగా పడిపోయింది. హెలికాప్టర్ మనీ విధానాన్ని అమలు చేయాలని సీఎం కేసీఆర్ కోరినప్పటికీ.. కేంద్రం నుంచి స్పందన కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఏం చేయాలనే అంశంపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రేషన్, నగదు బదిలీ, వ్యవసాయ రంగం, పంటల కొనుగోళ్లు, విశ్రాంత ఉద్యోగుల పింఛనులో కోత, తదితర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Read More: 

రేపటి నుంచి లాక్‌డౌన్ సడలింపులు.. ఏం తెరుచుకుంటాయంటే!

84 ఏళ్ల వయసులో కూడా ‘బాలను రా మదనా’ అంటూ జమున డ్యాన్స్