బకాయిల విడుదలకై పార్లమెంట్ వద్ద టీఆర్ఎస్ ఎంపీల ధర్నా
తెలంగాణకు రావాల్సిన నిధులు, జీఎస్టీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ బుధవారం పార్లమెంటు ఆవరణలో తెరాస ఎంపీలు నిరసనకు దిగారు. ఉభయసభల్లో వాయిదా తీర్మానాలను కూడా సమర్పించారు. గ్రామీణాభివృద్ద్ధి నిధులను తక్షణమే విడుదల చేయాలనీ, దేశంలో ఆర్థిక మాంద్యం లేదని చెబుతున్న కేంద్రం రాష్ట్రానికి అవసరమైన నిధులను మంజూరు చేయడంలేదని ఎంపీలు ఆరోపించారు. ఈ ఆర్ధిక సంవత్సరం పన్నుల్లో రాష్ట్ర వాటా గత ఏడాదికన్నా 2. 13 శాతం తక్కువ వచ్చిందని కూడా ఎంపీలు పేర్కొన్నారు. […]
తెలంగాణకు రావాల్సిన నిధులు, జీఎస్టీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ బుధవారం పార్లమెంటు ఆవరణలో తెరాస ఎంపీలు నిరసనకు దిగారు. ఉభయసభల్లో వాయిదా తీర్మానాలను కూడా సమర్పించారు. గ్రామీణాభివృద్ద్ధి నిధులను తక్షణమే విడుదల చేయాలనీ, దేశంలో ఆర్థిక మాంద్యం లేదని చెబుతున్న కేంద్రం రాష్ట్రానికి అవసరమైన నిధులను మంజూరు చేయడంలేదని ఎంపీలు ఆరోపించారు. ఈ ఆర్ధిక సంవత్సరం పన్నుల్లో రాష్ట్ర వాటా గత ఏడాదికన్నా 2. 13 శాతం తక్కువ వచ్చిందని కూడా ఎంపీలు పేర్కొన్నారు. కాగా.. ఈ విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇటీవలే కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే.