గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్న టీఆర్ఎస్ ఎంపీ రాములు
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మహా ఉద్యమంలా కొనసాగుతుంది. ఆయన పిలుపు మేరకు పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ముందుకు..
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మహా ఉద్యమంలా కొనసాగుతుంది. ఆయన పిలుపు మేరకు పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి మొక్కలు నాటడమే కాకుండా బాధ్యత తీసుకోని ఇతరుల చేత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను పూర్తి చేయించడం జరుగుతుంది. తాజాగా నాగర్కర్నూల్ టీఆర్ఎస్ ఎంపీ రాములు తన జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్నారు. తన కుమారుడు, మనవళ్లతో కలిసి రాములు మొక్కలు నాటారు. అలాగే గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు ఎంపీ రాములు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ ఎంపీ రాములకు ధన్యవాదాలు తెలిపారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
How impressive is this from Hon’ble MP Nagarkurnool #Ramulu garu! Thank you for accepting the #GreenIndiaChallenge and planting saplings only on your birthday along with your son and grand children?. #GIC ???. pic.twitter.com/iCaXqN4muw
— Santosh Kumar J (@MPsantoshtrs) August 17, 2020
Also Read:
మళ్లీ పెరుగుతోన్న పెట్రోల్ ధరలు
బ్రేకింగ్ః ముంబైలోని క్రాఫోర్డ్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం