రేవంత్ రెడ్డి భూ వివాదంపై టీఆర్ఎస్ నేతలు ఏమన్నారంటే!
కబ్జాకు కాదేది అనర్హం అంటారు... అది పెద్దల భూమా... పేదల భూమా అన్నది కబ్జాకోరులకు సంబంధం లేదు. కన్నుపడిందంటే చాలు ఖతమే.... ఆ భూముల్లో రాబంధుల్లా రాలుతారు. గోపన్పల్లి, గంధంగూడలో సరిగ్గా ఇదే జరిగింది. దళితులను భయపెట్టి..
కబ్జాకు కాదేది అనర్హం అంటారు… అది పెద్దల భూమా… పేదల భూమా అన్నది కబ్జాకోరులకు సంబంధం లేదు. కన్నుపడిందంటే చాలు ఖతమే…. ఆ భూముల్లో రాబంధుల్లా రాలుతారు. గోపన్పల్లి, గంధంగూడలో సరిగ్గా ఇదే జరిగింది. దళితులను భయపెట్టి ఏంతో కొంత ముట్టజెప్పి లాగేసుకున్నారు ఓ ఎంపీ. అయితే ఇలాంటి వ్యవహారాలను ఉపేక్షించే ప్రసక్తేలేదంటోంది తెలంగాణ సర్కారు. కబ్జాకోరుల భరతం పడతామని హెచ్చరిస్తోంది.
రంగారెడ్డి జిల్లా గంధంగూడ భూ కబ్జా వ్యవహారం తెలంగాణ శాసనమండలిలో ప్రస్తావనకు వచ్చింది. ఈ అంశాన్ని లేవనెత్తారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప్రభాకర్. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ.. దళితుల భూమిని కబ్జా చేశారని.. అది వారికే ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. దాంతో పాటు పాటు దళితుల భూమిని కబ్జా చేసినవారిపై అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. కబ్జాచేసిన భూమిని ఎప్పటిలోగా అప్పగిస్తారో చెప్పాలన్నారు ఎమ్మెల్సీ ప్రభాకర్.
ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించింది. గంధంగూడలో 3.22 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని… త్వరలో ఈ భూకబ్జా విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. అటు గోపన్పల్లి భూదందాపై కూడా త్వరలోనే స్పందిస్తామన్నారు. కబ్జా చేసిన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి.
పేదలకు అండగా ఉండాల్సిన ఓ ప్రజాప్రతినిధి కబ్జాకోరుగా మారిపోవడం ఏంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇతరులపై బురద జల్లడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇకనైనా దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని రాజకీయ పరిశీలకులు హితవు పలుకుతున్నారు.