కరెంట్ షాక్ తో టీఆర్ఎస్ నేత మృతి..
రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మొద్దు అమరేందర్రెడ్డి గురువారం కరెంట్ షాక్ తో మృతి చెందారు.
రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మొద్దు అమరేందర్రెడ్డి గురువారం కరెంట్ షాక్ తో మృతి చెందారు. వ్యవసాయ పనులు చేస్తుండగా పొలం వద్ద ఈ ప్రమాదం జరిగింది. జిల్లా టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగంలో చురుకైన నాయకుడిగా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడూ యాక్టీవ్ గా పాల్గొనేవారు.
కాగా అమరేందర్రెడ్డి అకాల మరణ వార్త విని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి దిగ్భాంతి వ్యక్తం చేశారు. గురువారం ఉదయం కొంగరకలాన్లో జరిగిన హరితహారం ప్రొగ్రామ్ లో మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కిషన్రెడ్డితో కలిసి ఆయన హరితహారం కార్యక్రమ ప్రారంభంలో పాల్గొన్నారు. అమరేందర్రెడ్డి మృతి చెందాడన్న వార్త విని పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు ఆవేదనకు లోనయ్యారు. 35 సంవత్సరాల అమరేందర్రెడ్డికి భార్య మాసన, కూమార్తె ఉన్నారు.