‘ఆ.. పూలమ్మ పూలు…’ అంటూ మంగాపురం కాలనీలో పూలు అమ్మి ప్రజలను ఓట్లు అడిగిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ఆ.. పూలమ్మ పూలు... అంటూ మంగాపురం కాలనీలో పూలు అమ్మి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మీర్ పేట్ హౌసింగ్ బోర్డు కాలనీ..

'ఆ.. పూలమ్మ పూలు...' అంటూ మంగాపురం కాలనీలో పూలు అమ్మి  ప్రజలను ఓట్లు అడిగిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
Follow us

|

Updated on: Nov 24, 2020 | 1:33 PM

ఆ.. పూలమ్మ పూలు… అంటూ మంగాపురం కాలనీలో పూలు అమ్మి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మీర్ పేట్ హౌసింగ్ బోర్డు కాలనీ టీఆర్ఎస్ అభ్యర్థి జెర్రి పోతుల ప్రభుదాస్ తో కలిసి, ఇంటింటికీ తిరుగుతూ, ప్రతి ఓటరును కలుస్తున్నారు దయన్న. ఓటర్లతో ప్రత్యేకంగా ఫోటోలు దిగుతూ, యువతని ఉత్సాహ పరుస్తూ, కాలనీల్లో కలియ తిరుగుతున్నారు. సీఎం కేసిఆర్ ఆశీర్వాదం, కేటీఆర్ సహకారంతో మొత్తం హైదరాబాద్.. విశ్వ నగరంగా మరుతున్నదని మంత్రి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

సీఎం కేసీఆర్ మంచి పరిపాలకుడన్న దయన్న.. ఆయన ప్రజల సంక్షేమం కోసం చాలా ముందు చూపుతో వున్నారని తెలిపారు. మీరు అడగకున్నా, మీ కష్టాలు తెలుసు కాబట్టే మీ కోసం కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని దయాకర్ రావు తెలిపారు. ఇందులో భాగంగానే ఎన్నికల మ్యానిఫెస్టోలో ఎన్నో సరికొత్త పథకాలు తీసుకొచ్చారన్నారు. గత ఎన్నికల్లో మాదిరి ఈ సారి ఎన్నికల్లోనూ కారు గుర్తు కి ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్తులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.