Dubbaka By-poll: టీఆర్ఎస్, బీజేపీ నామినేషన్లు దాఖలు

దుబ్బాక ఉప ఎన్నిక రోజురోజుకూ రక్తి కడుతోంది. తాజాగా రెండు ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పరస్పరం సెటైర్లు రువ్వుకుని, పరస్పరం విమర్శలు చేసుకున్నారు.

Dubbaka By-poll: టీఆర్ఎస్, బీజేపీ నామినేషన్లు దాఖలు
Follow us

|

Updated on: Oct 14, 2020 | 7:03 PM

TRS BJP candidates filed nominations: దుబ్బాక ఉప ఎన్నికలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. బుధవారం నాడు ఇద్దరు ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఆర్థిక మంత్రి హరీశ్ రావు వెంటరాగా.. అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున దివంగత రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత ముందుగా నామినేషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ వెంటరాగా.. ఆ పార్టీ తరపున రఘునందన్ రావు నామినేషన్ దాఖలు చేశారు.

గులాబీ శ్రేణులు భారీ సంఖ్యలో ఊరేగింపుగా వచ్చినప్పటికీ… నామినేషన్ దాఖలును అత్యంత నిరాడంబరంగా నిర్వహించారు మంత్రి హరీశ్ రావు. తనతోపాటు అభ్యర్థి సుజాత, స్థానిక ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాత్రమే నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు. నామినేషన్ దాఖలుకు ముందు మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు.. కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రాష్ట్రానికి నిధులివ్వని బీజేపీకి ఈ ఉప ఎన్నికలో బుద్ది చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.

కాగా.. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అత్యంత అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌తో కలిసి ఆయన ఊరేగింపు నిర్వహించారు. సంజయ్, రఘునందన్ రావులు పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు. రఘునందన్ రావును గెలిపించడం ద్వారా అసెంబ్లీలో ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీసే ఓ ఎమ్మెల్యేను పంపాలని సంజయ్ ప్రజలను కోరారు. కాగా.. ఇద్దరు ప్రధాన పార్టీల అభ్యర్థులు బుధవారం నామినేషన్ దాఖలు చేయగా.. గురువారం నామినేషన్ వేసేందుకు కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి రెడీ అవుతున్నారు. అక్టోబర్ 16వ తేదీతో నామినేషన్ల పర్వ ముగియనున్నది.

Also read: కుంగిన రోడ్డు.. ప్రమాదంలో మెట్రో పిల్లర్

Also read: రెండోతరం వాక్సిన్‌తోనే సాధారణ స్థితి

Also read: చంద్రబాబుకు ఛాన్సివ్వండి..హైకోర్టు ఆదేశం

Also read: అక్టోబర్ 28న కృష్ణా రివర్ బోర్డు భేటీ

Also read: నవంబర్ 9న రాజ్యసభ ఎన్నికలు

Also read: కోలుకున్న గేల్.. బెంగళూరుతో మ్యాచ్‌కు రెడీ

Also read: మహేశ్ హత్యకేసులో ఇద్దరి అరెస్టు!

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..