మహేశ్తో త్రివిక్రమ్ : ముచ్చటగా మూడోసారి !
సూపర్స్టార్ మహేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మధ్య మంచి బాండింగ్ ఉంది. గతంలో వీరిద్దరూ కలిసి ‘అతడు, ఖలేజా’ సినిమాల కోసం కలిసి పనిచేశారు. ఇందులో ‘అతడు’ సినిమా ఓ మోస్తారు విజయాన్ని అందుకుంది. టీవీల్లో మాత్రం రేటింగుతో అదరగొట్టింది. ఇక ‘ఖలేజా’ ఫ్లాప్ అవ్వగా.. టీవీలో మాత్రం సూపర్ రేటింగులు సాధించింది. తర్వాత వీరిద్దరు కలిసి పనిచెయ్యలేదు. అయితే రీసెంట్గా మహేశ్ను త్రివిక్రమ్ కలిసి కథా పరమైన చర్చలు జరిపారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అంతా […]
సూపర్స్టార్ మహేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మధ్య మంచి బాండింగ్ ఉంది. గతంలో వీరిద్దరూ కలిసి ‘అతడు, ఖలేజా’ సినిమాల కోసం కలిసి పనిచేశారు. ఇందులో ‘అతడు’ సినిమా ఓ మోస్తారు విజయాన్ని అందుకుంది. టీవీల్లో మాత్రం రేటింగుతో అదరగొట్టింది. ఇక ‘ఖలేజా’ ఫ్లాప్ అవ్వగా.. టీవీలో మాత్రం సూపర్ రేటింగులు సాధించింది. తర్వాత వీరిద్దరు కలిసి పనిచెయ్యలేదు. అయితే రీసెంట్గా మహేశ్ను త్రివిక్రమ్ కలిసి కథా పరమైన చర్చలు జరిపారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే మహేశ్, త్రివికమ్ర్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ రూపొందనుందని తెలుస్తోంది. ఎన్టీఆర్తో త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ సినిమా స్క్రిప్ట్పై ఫోకస్ చేస్తారట. మరోవైపు జక్కన్న మూవీ స్టార్ట్ అయ్యే లోపు మహేశ్, త్రివిక్రమ్ కాంబో మూవీ తెరకెక్కే ఛాన్స్ ఉందని చెబుతున్నారు కొందరు.
Also Read :