ప్రభాస్తో త్రివిక్రమ్..డెడ్లీ కాంబో ఫిక్స్..!
త్రివిక్రమ్ శ్రీనివాస్..టాలీవుడ్ టాప్ డైరెక్టర్. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి బడా హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ తీసిన త్రివిక్రమ్… త్వరలోనే డార్లింగ్ ప్రభాస్ ని కూడా డైరెక్ట్ చెయ్యబోతున్నారని ఫిల్మ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ప్రస్తుతం ప్రభాస్.. ‘జిల్’ మూవీ ఫేమ్ రాధాక్రిష్ణ తెరకెక్కిస్తోన్న పీరియాడిక్ లవ్ డ్రామాలో నటిస్తున్నారు. ‘సాహో’ చిత్రం తన అభిమానులకు అంతగా రుచింపకపోవడంతో..ఈ చిత్రంలో ఆ లోటు తీర్చి మంచి […]
త్రివిక్రమ్ శ్రీనివాస్..టాలీవుడ్ టాప్ డైరెక్టర్. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి బడా హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ తీసిన త్రివిక్రమ్… త్వరలోనే డార్లింగ్ ప్రభాస్ ని కూడా డైరెక్ట్ చెయ్యబోతున్నారని ఫిల్మ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
ప్రస్తుతం ప్రభాస్.. ‘జిల్’ మూవీ ఫేమ్ రాధాక్రిష్ణ తెరకెక్కిస్తోన్న పీరియాడిక్ లవ్ డ్రామాలో నటిస్తున్నారు. ‘సాహో’ చిత్రం తన అభిమానులకు అంతగా రుచింపకపోవడంతో..ఈ చిత్రంలో ఆ లోటు తీర్చి మంచి హిట్ అందుకునేందుకు అడుగులు ముందుకు వేస్తున్నాడు. ఈ మూవీ తరువాత ‘మహానటి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్తో పాన్ ఇండియా మూవీ లైన్లో పెట్టారు ప్రభాస్.
ఇక ఈ సంక్రాంతికి అల్లు అర్జున్తో ‘అల వైకుంఠపురములో’ మూవీతో వచ్చి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు త్రివిక్రమ్. అయితే ప్రభాస్-త్రివిక్రమ్ కలయికలో మూవీ సెట్టయినట్టు టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. ఎప్పట్నుంచో ప్రభాస్కి సరిపడే కథతో రెడీగా ఉన్న త్రివిక్రమ్ త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్లాన్ సిద్దం చేస్తున్నారట. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న రెండు చిత్రాలు కంప్లీట్ కావడానికి 2022 వరకూ సమయం పట్టే అవకాశం ఉండటంతో… 2022 తరువాత ప్రభాస్-త్రివిక్రమ్ మూవీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30 మూవీని డైరెక్ట్ చేస్తున్నారు.