Chiranjeevi: త్రిష ఔట్.. కలిసొచ్చిన హీరోయిన్తో రెండోసారి చిరు.!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్య సినిమా నుంచి త్రిష తప్పుకున్న విషయం తెలిసిందే. క్రియేటివ్ డిఫరెన్సెస్ వలన ఈ మూవీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు త్రిష సోషల్ మీడియాలో వెల్లడించింది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్య సినిమా నుంచి త్రిష తప్పుకున్న విషయం తెలిసిందే. క్రియేటివ్ డిఫరెన్సెస్ వలన ఈ మూవీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు త్రిష సోషల్ మీడియాలో వెల్లడించింది. అయితే పాత్ర విషయంలో సంతృప్తి లేకపోవడంతోనే ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి త్రిష తప్పుకోవడంతో.. ఇప్పుడు మరో హీరోయిన్ను సంప్రదించే పనిలో పడింది చిత్ర యూనిట్. ఈ క్రమంలో చందమామ కాజల్ను కలిశారట మూవీ నిర్మాతలు. ఆమెతో సంప్రదింపులు జరపడం.. ఇందులో నటించేందుకు కాజల్ ఒప్పుకోవడం జరిగి పోయిందని ఫిలింనగర్ వర్గాల సమాచారం. అంతేకాదు ఈ నెలాఖరులో కాజల్ ఆచార్య సెట్లోకి ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
కాగా దాదాపు 10ఏళ్ల తరువాత చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నంబర్. 150లో కాజల్ నటించింది. ఇక ఈ సినిమా హిట్ కాగా.. అదే సెంటిమెంట్తో మరోసారి కాజల్ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే కాజల్కు మరోసారి బంపరాఫర్ వచ్చినట్లే. ఇదిలా ఉంటే ఈ మూవీలో మరో కీలక పాత్రలో చెర్రీ గానీ, మహేష్ గానీ నటించే అవకాశాలు ఉన్నాయి. ఇక కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఆగష్టులో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకుడు కొరటాల భావిస్తున్నారు.
Read This Story Also: నెల రోజుల ఉత్కంఠ.. సొంతింటికి చేరుకున్న అన్నెం జ్యోతి..!