త్రిష ఓపెన్ అప్పీల్
ప్రముఖ హీరోయిన్ త్రిష ఈ వీకెండ్ లో మొక్కలు నాటి తానూ పర్యావరణ ప్రేమికురాలినేనని చెప్పకనే చెప్పింది. ‘గ్రీన్ఇండియా ఛాలెంజ్’ ను అంగీకరించి రెండు మొక్కలు నాటానని త్రిష పేర్కొంది. మీరందరూ కూడా మీవంతుగా మొక్కలు నాటి పచ్చని భారతదేశ రూపకల్పనకు సాయం చేయాలని ప్రజలందరికీ విజ్ణప్తి చేసింది. ఈ మేరకు ట్వీట్ చేసిన ఈ ఎవర్ గ్రీన్ హీరోయిన్.. మొక్కలు నాటుతున్నసందర్భంలోని ఫొటోలను కూడా పలువురితో పంచుకుంది. ఇలాఉండగా, కొన్ని సృజనాత్మక కారణాల వల్లే ఆచార్య […]
ప్రముఖ హీరోయిన్ త్రిష ఈ వీకెండ్ లో మొక్కలు నాటి తానూ పర్యావరణ ప్రేమికురాలినేనని చెప్పకనే చెప్పింది. ‘గ్రీన్ఇండియా ఛాలెంజ్’ ను అంగీకరించి రెండు మొక్కలు నాటానని త్రిష పేర్కొంది. మీరందరూ కూడా మీవంతుగా మొక్కలు నాటి పచ్చని భారతదేశ రూపకల్పనకు సాయం చేయాలని ప్రజలందరికీ విజ్ణప్తి చేసింది. ఈ మేరకు ట్వీట్ చేసిన ఈ ఎవర్ గ్రీన్ హీరోయిన్.. మొక్కలు నాటుతున్నసందర్భంలోని ఫొటోలను కూడా పలువురితో పంచుకుంది.
ఇలాఉండగా, కొన్ని సృజనాత్మక కారణాల వల్లే ఆచార్య సినిమా నుంచి తప్పుకున్నానని తెలిపి త్రిష ఇటీవల సినిమా అభిమానుల్ని షాక్ గురించేసిన సంగతి తెలిసిందే. `కొన్ని విషయాలు మనం ఊహించినట్టుగా జరగవు. నచ్చని విషయాల్ని భరిస్తూ వుండలేం’. ఆ కారణం వల్లే తాను `ఆచార్య` నుంచి బయటికి వచ్చినట్టు త్రిష క్లారిటీ ఇచ్చింది. `ఆచార్య` బృందానికి నేను శుభాకాంక్షలు చెబుతున్నాను’. అంటూ త్రిష చెప్పుకొచ్చింది.
I accepted the #GreenIndiaChallenge and planted two saplings today. I request you all to do your bit and help towards a greener India? pic.twitter.com/poz7r3kRRV
— Trish (@trishtrashers) October 3, 2020