Viral: ఆన్లైన్లో కుర్చీ ఆర్డర్ చేస్తే.. చివరికి పార్శిల్లో వచ్చింది చూసి కళ్లు బైర్లు కమ్మాయ్!
తక్కువ టైం.. అందుబాటు ధరల్లో మనకు దొరికేస్తుండటంతో ఈ మధ్యకాలంలో ప్రతీ ఒక్కరూ ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారు.
జస్ట్ వన్ క్లిక్.. ఫుడ్ నుంచి ఫర్నిచర్ వరకు ఏదైనా ఇంటి దగ్గర నుంచే ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసేయొచ్చు. మనకు నచ్చిన వస్తువు.. తక్కువ టైం.. అందుబాటు ధరల్లో మనకు దొరికేస్తుండటంతో ఈ మధ్యకాలంలో ప్రతీ ఒక్కరూ ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారు. తాజాగా ఓ మహిళ కూడా ఇలాగే తనకు నచ్చిన కుర్చీ కోసం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది. ఇక ఇంటికొచ్చిన పార్శిల్ ఓపెన్ చేసి చూడగా ఆమె ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆ కథేంటంటే.?
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని నూయార్క్లో నివసిస్తున్న 29 ఏళ్ల జెన్ బెగాకిస్ ఇటీవల అమెజాన్లో చిన్నపాటి లెదర్ చైర్ను ఆర్డర్ పెట్టింది. పార్శిల్ ఇంటికొచ్చేసరికి.. ఎంతో కుతూహలంగా దాన్ని ఓపెన్ చేసింది. అందులో ఆమెకు నచ్చిన కుర్చీ పార్ట్స్ ఉండగా.. వాటితో పాటుగా సేకరించిన రక్తంతో కూడిన ఒక గాజు ట్యూబ్ ఆ బాక్స్లో ఉంది. దాన్ని చూసి ఒక్కసారిగా ఆమె షాక్ అయింది. ఇక ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా నెటిజన్లతో పంచుకుంది బెగాకిస్. పార్శిల్ చూసి భయాందోళన చెందడంతో పాటు అయోమయానికి గురైనట్లు పేర్కొంది. దీనికి సంబంధించిన ఒక వీడియోను కూడా పోస్ట్ చేసింది. కాగా, ఈ పార్శిల్ గురించి అమెజాన్ దృష్టికి తీసుకెళ్లినట్లు జెన్ తెలిపింది. తొలుత దీనిపై స్పందించిన ఆ సంస్థ అనంతరం మౌనం వహించిందని చెప్పింది.
i’m as terrified as i am confused ? pic.twitter.com/0tSvkqK1Oo
— Jen Begakis (@jenbegakis) June 16, 2022