Tamil Nadu: అంగరంగ వైభంగా పెంపుడు పిల్లులకు సీమంతం వేడుకలు.. నెట్టింట్లో వీడియో వైరల్
Tamil Nadu: పెంపుడు జంతువులను తమ కుటుంబ సభ్యులతో సమానంగా చూస్తారు కొందరు. కుక్క, పిల్లి వంటి జంతువులను తమ పిల్లలగా భావించి.. వేడుకలను జరపడం, అందంగా అలంకరించడం..
Tamil Nadu: పెంపుడు జంతువులను తమ కుటుంబ సభ్యులతో సమానంగా చూస్తారు కొందరు. కుక్క, పిల్లి వంటి జంతువులను తమ పిల్లలగా భావించి.. వేడుకలను జరపడం, అందంగా అలంకరించడం వంటి సరదాలు తీర్చుకుని సంతోషపడుతున్నారు. వాటికి సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో దర్శనంఇచ్చి సందడి చేస్తున్నాయి. తాజాగా గర్భవతులైన పిల్లలులకు మహిళలకు జరిపినట్లే శీమంతం వేడుకను నిర్వహించి.. తమ ముచ్చటను తీర్చుకుంది తమిళనాడులోని ఒక కుటుంబం. పిల్లి జాతి కోసం బేబీ షవర్ను నిర్వహించింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు జరిపినట్లే.. ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే..
కోయంబత్తూరుకు చెందిన యజమానులు తమ రెండు పెర్షియన్ పిల్లులకు అంగరంగ వైభంగా సీమంతం వేడుకను అంతేకాదు ఈ వేడుకల్లో భాగంగా స్నేహితులకు, సన్నిహితులకు భారీగా పార్టీ ఇచ్చారు. పెంపుడు జంతువులకు పెట్ క్లినిక్లో నిర్వహించిన బేబీ షవర్ వేడుకలో.. గర్భవతులైన పిల్లులను పూలమాలలతో అలంకరించారు. వాటిపై తమకున్న ప్రేమను తెలియజేస్తూ.. ఆశీర్వదించారు.
ఈ బేబీ షవర్ వేడుక కోసం ప్రత్యేకంగా రెడీ అయ్యారు. పిల్లులకు కొత్తబట్టలు వేశారు. వాటికి ప్రత్యేక ఆహారం, స్వీట్లు, ఆహార పదార్ధాలతో విందుఇచ్చారు. ఈ సందర్భంగా పిల్లుల యజమానులు మాట్లాడుతూ.. అందరూ మహిళలకు సీమంతం చేస్తారు.. మాకు మా పిల్లులు మా ఫ్యామిలీ మెంబర్స్.. కనుక మేము కూడా గర్భవతులైన పిల్లులకు సీమంతం చేశామని చెప్పారు. క్షీరం ఐరిష్ ఈ రెండు పిల్లులకు ఏడాది వయసు.. ఇవి గర్భం దాల్చి 50వ రోజు, 35 రోజులైంది. అయితే పిల్లులు గర్భధారణ సమయం 62 రోజులన్న సంగతి తెలిసిందే.
నెట్టింట్లో ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వేడుకలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు పెంపుడు జంతువుల పట్ల యజమాని ప్రేమను ప్రస్తావిస్తే…ఇటువంటి వేడుక నిర్వహించడం గొప్ప అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తుంటే.. మరికొందరు ఇందులో వింత ఏముంది.. మేము ఏమీ థ్రిల్ కాలేదని కామెంట్ చేస్తున్నారు.
Also Read: ఆ ప్రదేశం అతి శీతల ప్రాంతంలో డ్రై వ్యాలీస్.. 20 లక్షల ఏళ్లుగా కురవని వానలు..