Viral Video: వరదది ఏముంది..? బిడ్డ కోసం సునామీకైనా నాన్న ఎదురెళ్లడా..?
నాన్న.. మనల్ని ఎప్పుడూ వెంటాడే ఎమోషన్. పిల్లలు కెరీర్ పరంగా ఏ దారి ఎంచుకున్నా.. ప్రయాణంలో ఏ అడ్డంకి వచ్చినా.. నేనునానంటూ భరోసాగా ఉండి పిల్లల్ని నడిపిస్తుంటాడు నాన్న.
Trending Video: నాన్న.. మనల్ని ఎప్పుడూ వెంటాడే ఎమోషన్. పిల్లలు కెరీర్ పరంగా ఏ దారి ఎంచుకున్నా.. ప్రయాణంలో ఏ అడ్డంకి వచ్చినా.. నేనునానంటూ భరోసాగా ఉండి పిల్లల్ని నడిపిస్తుంటాడు నాన్న. దండించి అయినా సరే పిల్లల్ని మంచి మార్గంలో ఉంచే హక్కు ఉంది నాన్నకే. తాను ఎంత వెనక పడ్డా పిల్లల్ని కింద పడకుండా చూస్కుంటాడు. అమ్మ కనిపించేలా ప్రేమను చూపిస్తే.. తండ్రి మాత్రం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూనే.. తన బిడ్డలను ఎదుగుదలను చూసి మురిసిపోతూ ఉంటాడు. తాజాగా ఓ నాన్నకు సంబంధించిన వీడియో ప్రతి ఒక్కరిని ఎమోషనల్కు గురి చేస్తోంది. అప్పుడే పుట్టిన తన బిడ్డను ఎత్తుకుని ఎమోషనల్ అవుతూ, వరదలో నడుచుకుంటూ సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాడు ఓ తండ్రి. అస్సాంలో ఓ వైపు వరదలు బీభత్సం సృష్టిస్తున్న సమయంలో ఓ మహిళ ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇంట్లోకి వచ్చిన వరద నీటిలోనే ప్రసవించడంతో తల్లిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా.. ఆ బిడ్డను ఓ బుట్టలో ఉంచి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాడు చిన్నారి తండ్రి. ఓ వైపు భయాందోళనకు గురి చేసే వరదలో నడుస్తూనే.. బిడ్డను చూస్తూ ఎమోషనల్ అవుతూ వరదలో జాగ్రత్తగా నడుచుకుంటూ సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఈ వీడియోను షేర్ చేసిన యూజర్ చిన్ననాటి శ్రీకృష్ణుని మోస్తూ యమునా నదిని దాటిన వాసుదేవునితో ఆ తండ్రిని పోల్చాడు. ప్రతిరోజూ ఫాదర్స్ డే అని పేర్కొన్నాడు. ఇక ఈ సీన్ చూసిన ప్రతి ఒక్కరు.. తమ తండ్రి తమ కోసం చేసిన త్యాగాలు, అలాగే మనం ఏ చిన్న విజయం సాధించినా శభాష్ అంటూ మెచ్చుకున్న సందర్భాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. చివరగా మన లైఫ్కి ఆయనే హీరో ఆయనకి కట్ఔట్లు నిలబెట్టాల్సిన పని లేదు ఆయన పేరు నిలబడితే చాలు.!
Heartwarming picture from Silchar Floods! This video of a father crossing the waters with his newborn baby in Silchar reminds of Vasudeva crossing river Yamuna taking newborn Bhagwan Krishna over his head! Everyday is Father’s Day!@narendramodi @himantabiswa @drrajdeeproy pic.twitter.com/1PEfaiCxA5
— Sashanka Chakraborty ?? (@SashankGuw) June 21, 2022
అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. రాష్ట్రంలో వరదలతో పాటు కొండచరియలు విరిగిపడటంతో 80 మందికి పైగా మరణించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మకు రెండుసార్లు డయల్ చేసి రాష్ట్ర పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి