Viral: వేద కాలం నుంచి మానవజాతికి జీవనాడి.. అక్కడ గోమూత్ర స్నానం చేయాల్సిందే
అమ్మ, ఆవు అని చదువుకున్నాం. అంటే అమ్మ లాంటిదే గోవు అని అర్ధం. ప్రపంచంలో ఏ జంతువుకూ దక్కని గుర్తింపు గోవుకే దక్కింది. సమస్త హిందువుల చేత గోమాతగా ఆరాధించబడుతోంది.
గోవును ఆరాధిస్తే..సమస్త దేవతలను ఆరాధించినట్లేనని పురాణాలు చెబుతాయి. అందుకే ఆవును గోమాత అని పిలుస్తారు. గోవు అంటే నడిచే దేవాలయం. కంటి ముందు కదలాడే కామధేనువు. ఇంటి ముందు వెలసిన శ్రీమహాలక్ష్మి. మొత్తంగా గోవు భారతీయుల గుండె చప్పుడు. గోవు కేంద్రంగా భారతదేశపు ఆధ్యాత్మిక చిత్రం మొత్తం అల్లుకుని కనిపిస్తుంది. ఇక్కడ గోవంటే ముక్కోటి దేవతలను ఒక్క చోటే దర్శించుకునే వీలైన రూపం. గోవు నుంచి వెలువడే పంచగవ్యాలను పంచామృతాలుగా భావించే పుణ్యభూమి. ఇంటింటా సిరులు కురిపించే శ్రీమహాలక్ష్మిగా భావించే నేల భారతావని. వేద కాలం నుంచి మానవజాతికి జీవనాడిగా గోవుకు ఎంతో విశిష్టత ఉంది.
అయితే మనం మాత్రమే కాదు.. దక్షిణ సూడాన్లోని ‘ముందరి’ తెగవాసులకు గోవు అంటే అమ్మ..దైవం. గోమూత్రాన్ని పరమ తీర్థంగా భావిస్తారు. ఇళ్లల్లో పక్కాగా ఆవులను పెంచుతారు. వాటిని జాగ్రత్తగా చూసుకుంటారు. వారికి జీవనాధారం కూడా అవే. అంతేకాదు మగవాళ్లు.. గోవులు ఎప్పుడు మూత్ర విసర్జన చేస్తాయా అని కాచుకూని కూర్చుంటారు. ఆవు మూత్ర విసర్జన మొదలెట్టగానే వారు తలను తీసుకెళ్లి అక్కడ పెట్టేస్తారు.
జుట్టుకు మంచి కలర్ రావడానికి, ధృడంగా ఉండటానికి అది ఉపయోగపడుతుందని వాళ్లు విశ్వశిస్తారు. అందుకే ఆ తెగ వారి జుట్టు రాగి రంగులో ఉంటుంది. అలాంటి ప్రత్యేక రంగు జుట్టు కలిగిన మగవాళ్లనే.. అక్కడి మహిళలు ఇష్టపడతారట. అంతే కాదండోయ్.. అక్కడి మగవాళ్లు ఒక్కోసారి గోమూత్రంతోనే స్నానాలూ కానిచ్చేస్తారట. ‘ముందరి’ ప్రజల గురించి తెలుసుకునేందుకు అక్కడి వెళ్లే పర్యాటకుల సంఖ్య కూడా ఈ మధ్యకాలంలో పెరిగింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.