Sheep Sentenced: గొర్రెకు మూడేళ్ల కఠిన జైలు శిక్ష.. నేరం ఏంటో తెలిస్తే షాకవుతారు..
సూడాన్లో చోటు చేసుకుంది. ఇక్కడ ఒక గొర్రె మహిళపై దాడి చేసింది. ఓ 45 ఏళ్ల మహిళను ఈ గొర్రె చంపింది. ఇక్కడి కోర్టు గొర్రెలకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అంతే కాదు..
గొర్రెకు జైలు శిక్ష(Sheep Sentenced) పడింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన సూడాన్లో చోటు చేసుకుంది. ఇక్కడ ఒక గొర్రె మహిళపై దాడి చేసింది. ఓ 45 ఏళ్ల మహిళను ఈ గొర్రె చంపింది. ఇక్కడి కోర్టు గొర్రెలకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అంతే కాదు ఈ ఘటనకు సంబంధించి గొర్రెల యజమానిని కోర్టు దోషిగా తేల్చనప్పటికీ.. అతనికి భారీ ఫైన్ వేసింది. గొర్రె దాడిలో మరణించిన మహిళ కుటుంబానికి 5 ఆవులను అందించాలని ఆదేశించింది. అలాగే శిక్ష పూర్తయిన తర్వాత ఆ కుటుంబానికి ఈ గొర్రెను కూడా పరిహారంగా ఇవ్వాల్సి ఉంటుంది. మీడియా నివేదికల ప్రకారం.. ఈ గొర్రెను ఈ నెల ప్రారంభంలో దక్షిణ సూడాన్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదియు చాపింగ్ అనే 45 ఏళ్ల మహిళపై గొర్రె తన కొమ్ములతో దాడి చేసింది. ఏకకాలంలో పలుసార్లు దాడి చేయడంతో ఆ మహిళ పక్కటెముకలు విరిగిపోయాయి. కొన్ని చోట్ల అంతర్గత గాయాల కారణంగా చికిత్స పొందుతూ ఆ మహిళ మరణించింది.
యజమాని అమాయకుడు, గొర్రెలు మహిళను చంపాయి కాబట్టి దానిని అదుపులోకి తీసుకున్నారు అక్కడి పోలీసులు. పోలీసుల కథనం ప్రకారం.. రుంబెక్ ఈస్ట్లోని అకుల్ యోల్ అనే స్థలంలో ఈ సంఘటన జరిగింది. ఘటన అనంతరం గొర్రెను అదుపులోకి తీసుకుని మాలెంగే అగోక్ పాయెం పోలీస్ స్టేషన్లో ఉంచారు. గొర్రెల యజమాని నిర్దోషి అని పోలీసు అధికారి మేజర్ ఎలిజా మెబర్ తేల్చారు. ఈ ఘటనకు పాల్పడిన గొర్రెను అదుపులోకి నిర్భందించారు. అయితే శిక్ష పడిన ఈ గొర్రెను మూడేళ్లపాటు మిలటరీ క్యాంపులో బంధించాల్సి ఉంటుందని షీప్కు కోర్టు శిక్ష విధించింది. దీని తరువాత, దాని యజమాని దానిని బాధితుడి కుటుంబానికి పరిహారంగా అందించాలని ఆదేశించింది కోర్టు.
బాధితురాలి కుటుంబానికి ఐదు ఆవులు..
అయితే కోర్టు తన నిర్ణయంలో బాధిత కుటుంబానికి ఐదు ఆవులను నష్టపరిహారంగా త్వరగా ఇవ్వాలని ఆదేశించింది. నిజానికి, బాధితురాలి కుటుంబం, గొర్రెల యజమాని దుయోని మాన్యాంగ్ ధాల్ ఇద్దరూ ఇరుగుపొరుగువారు. కోర్టు నిర్ణయానికి ఇద్దరూ అంగీకరించి ఒప్పందంపై సంతకాలు చేశారు.