Viral: డిసెంబర్‌ 20న 8 మందికి సూపర్ పవర్స్.. సంచలన విషయాలు వెల్లడించిన టైమ్ ట్రావెలర్

నిజంగానే ఏలియన్స్‌ ఉన్నాయా లేవా అన్నది మాత్రం కచ్చితంగా చెప్పలేం. కానీ అప్పుడప్పుడు మాత్రం సుదూర తీరాల నుంచి రేడియో సిగ్నల్స్‌ అందుతున్నాయని శాస్త్రవేత్తలు సైతం చెబుతున్నారు.

Viral: డిసెంబర్‌ 20న 8 మందికి సూపర్ పవర్స్.. సంచలన విషయాలు వెల్లడించిన టైమ్ ట్రావెలర్
Time Traveller
Follow us

|

Updated on: Dec 08, 2021 | 1:02 PM

ఏలియన్స్‌, టైమ్‌ ట్రావెలర్స్‌కు సంబంధించిన వార్తలు సోషల్‌ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో నిలుస్తుంటాయి. కానీ ఈ రెండు వార్తల్లో నిజమెంత అన్న విషయం తెలియకుండానే వైరల్‌ చేస్తుంటారు నెటిజన్స్‌.  నిజంగానే ఏలియన్స్‌ ఉన్నాయా లేవా అన్నది మాత్రం కచ్చితంగా చెప్పలేం. కానీ అప్పుడప్పుడు మాత్రం సుదూర తీరాల నుంచి రేడియో సిగ్నల్స్‌ అందుతున్నాయి. ఈ అనంత విశ్వంలో ఎక్కడో చోట భూమిని పోలిన గ్రహాలు ఉండవచ్చని, వాటిల్లో జీవులు ఉండవచ్చని సైంటిస్టులు బలంగా నమ్ముతున్నారు. ఆ నమ్మకంతోనే ఇప్పటి వరకు ఏలియన్స్‌ వేరే గ్రహంలో ఉంటాయన్న అనుమానంతోనే పరిశోధనలు చేపడుతున్నారు. ఇక టైమ్‌ ట్రావెలర్‌ మిషెన్‌ కూడా ఓ ఊహలాంటిదే. నిజంగానే మనిషికి కాలంలోకి ప్రయాణించగలడా.? ఒక్క వేళ నిజంగానే టైమ్‌ మిషెన్‌ అంటూ ఉంటే.. మనిషి నిజ జీవితంలో ఇన్ని మరణాలు, యుద్ధాలు, కన్నీళ్లు ఇవేవి ఉండేవి కావేమో. లేదంటే ఇంతకంటే రాక్షసంగా ఉండేవారమేమో. ఇదే కాన్సెప్ట్‌ చాలా సినిమాలో వచ్చాయి. కానీ.. రియల్‌ లైఫ్‌ మాత్రం ఇప్పటి వరకు సాధ్యం కాలేదు.

ఏది ఏమైనా కాలంలోకి ప్రయాణిస్తే.. అనే ఊహ చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే ఈ కాన్సెప్ట్‌ మీద వచ్చిన సినిమాలన్ని సూపర్‌ హిట్టయ్యాయి. అయితే ఇలాంటి విషయాలతోనే సొంత క్రేజ్‌ను సంపాదించుకోవాలని చూస్తున్నారు కొందరు నెటిజన్స్‌. ఇక తాజాగా ఓ వ్యక్తి.. తానో టైమ్‌ ట్రావెలర్‌ అని, త్వరలోనే భూమి మీద ఎన్నో వింతలు చోటుచేసుకుంటాయని తెలిపాడు. ఇప్పుడీ స్టోరీ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఇంతకీ.. ఈ వార్తలో నిజమెంత..? అన్నది ప్రశ్నార్థకం.

ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో టైమ్‌ ట్రావెలర్స్‌ అని చెప్పుకునేవారి సంఖ్య బాగా పెరిగింది. కొద్ది రోజుల క్రితం ఓ టిక్‌టాక్‌ యూజర్‌.. తాను 2027 నుంచి వచ్చానని భూమ్మీద తానే చివరి వ్యక్తిని అని చెప్పిన కహానీ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయింది. ఇక తాజాగా తెర మీదకు వచ్చిన వ్యక్తి.. అంతమించిన షాకింగ్‌ విషయాలను తెలిపాడు. త్వరలోనే భూమి మీద నమ్మశక్యం కానీ మార్పులు చోటు చేసుంటాయని తెలిపాడు. 5ఎంటీటీ అనే టిక్‌ టాక్ యూజర్ ఈ సంచలన విషయాలు వెల్లడించాడు. డిసెంబర్‌ 20న ఎనిమిది మంది మనుషులకు సూర్యుని తరంగాల ద్వారా సూపర్‌ పవర్స్‌ వస్తాయని, ఇక డిసెంబర్‌ 25న ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురు చేసే సంఘటన చోటు చేసుకుంటాయని తెలిపాడు. ఇది మానవాళి జీవితాలను శాశ్వతంగా మారుస్తుందని అన్నాడు. ఈ రెండు తేదీలలో జరగబోయే సంఘటనల తర్వాత.. తాను నిజమైన టైమ్ ట్రావెలర్‌ని అని జనాలు నమ్ముతారని తెలిపాడు.

అంతేకాక 2027 నాటికి స్వీడన్‌, నార్వే, యూకే, ఫిన్లాండ్‌ దేశాలు కలిసి అతి పెద్ద పవర్‌హౌస్‌ను నిర్మిస్తాయని వెల్లడించాడు. చిన్న, చిన్న దేశాలు దీనిలో చేరాలని ఆరాటపడతాయని పేర్కొన్నాడు. ఇక 2024లో 35వేల ఏళ్ల క్రితం నాటి బంకర్‌ ఒకటి వెలుగు చూస్తుందని… అర్జెంటినాలో ఈ బంకర్‌ని గుర్తిస్తారని పేర్కొన్నాడు. అందులో సాంకేతకతకు సంబంధించిన రహస్యాలు ఆ బంకర్‌లో ఉంటాయని చెప్పుకొచ్చాడు.

Also Read: Hyderabad: వాటర్‌ ట్యాంక్‌లో డెడ్‌బాడీ ఘటనలో పురోగతి.. మృతుడు ఇతడే

 గుండెపోటుతో యంగ్ యూట్యూబర్ ఆకస్మిక మరణం..ప్రదీప్‌తో ‘పెళ్లి చూపులు’ షో