తల్లిదండ్రులు ఓటేస్తే విద్యార్థులకు బంపర్ ఆఫర్..!
లక్నో: ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ నాయకులు… మీకు అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ హామీలు, వరాలు ఇస్తుంటారు. సరిగ్గా ఇలాగే ఓ కాలేజీ కూడా వరం ఇచ్చింది. అయితే ఇక్కడ ఒక విచిత్రం ఏమిటంటే ఆ వరం ఇచ్చింది ఓటర్లకు కాదు… వారి కాలేజ్లో చదువుతున్న విద్యార్థులకు. ‘‘తల్లిదండ్రులు ఓటేస్తే పిల్లలకు పది మార్కులు ఎక్కువ కలుపుతాం” ఇదే మా హామీ అని ఆ కాలేజీ విద్యార్థులకు భరోసా ఇచ్చింది. అయితే ఆ కాలేజీ […]
లక్నో: ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ నాయకులు… మీకు అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ హామీలు, వరాలు ఇస్తుంటారు. సరిగ్గా ఇలాగే ఓ కాలేజీ కూడా వరం ఇచ్చింది. అయితే ఇక్కడ ఒక విచిత్రం ఏమిటంటే ఆ వరం ఇచ్చింది ఓటర్లకు కాదు… వారి కాలేజ్లో చదువుతున్న విద్యార్థులకు. ‘‘తల్లిదండ్రులు ఓటేస్తే పిల్లలకు పది మార్కులు ఎక్కువ కలుపుతాం” ఇదే మా హామీ అని ఆ కాలేజీ విద్యార్థులకు భరోసా ఇచ్చింది. అయితే ఆ కాలేజీ ఉన్నది మాత్రం ఇక్కడ కాదు.. ఉత్తరప్రదేశ్లో. లక్నోలోని క్రైస్ట్ చర్చి కాలేజ్ విద్యార్థుల తల్లిదండ్రులు ఓటేస్తే.. విద్యార్థుల ఫైనల్ రిజల్ట్లో పది మార్కులు కలుపుతామని ఆ స్కూలు ప్రిన్సిపాల్ ఆర్కే ఛత్రీ చెప్పారు. చెప్పడమే కాదు గేటుకు పెద్ద బ్యానర్ కూడా కట్టారు.
ఈ ప్రజాస్వామ్యంలో ఓటు ఒక ఆయుధం. భావి తరాల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందంటూ, విద్యార్థుల తల్లిదండ్రులందరికీ మా విన్నపం ఏంటంటే అందరూ ఓటేయండి. ఓటు వేసిన వారి పిల్లలకు ఫైనల్ రిజల్ట్లో పది మార్కులు అదనంగా కలుపుతాం” అని ఆ బ్యానర్లో వివరించారు.