Viral News: మరీ ఇంత కోపం ఉందా?.. కంపెనీ స్పందించలేదని స్కూటర్ను గాడిదకు కట్టి..!
Viral News:ఇటీవల ఎలక్ట్రిక్ స్కూటర్ల భద్రత తదితర అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. కారణం ఈవీ స్కూటర్ల బ్యాటరీలు పేలిపోవడం
Viral News:ఇటీవల ఎలక్ట్రిక్ స్కూటర్ల భద్రత తదితర అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. కారణం ఈవీ స్కూటర్ల బ్యాటరీలు పేలిపోవడం, నడుస్తున్న వాహనాల్లో మంటలు చెలరేగడం లాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతోపాటు ఈ ఘటనల్లో పలువురు ప్రాణాలు సైతం కోల్పోగా.. మరికొందరు ప్రమాదాల నుంచి తృటిలో తప్పించుకున్నారు. అయితే.. తాజాగా ఓ ఎలక్ట్రిక్ స్కూటర్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. లక్ట్రిక్ స్కూటర్ ఆగిపోయిందని ఫిర్యాదు చేసినా.. సదరు కంపెనీ సరిగ్గా స్పందించలేదన్న కారణంతో ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన తెలిపాడు. స్కూటర్ను గాడిదకు కట్టేసి ఊరేగించాడు. ఈ ఘటన సోమవారం మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని పర్లి పట్టణంలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. పర్లికి చెందిన సచిన్ గిట్టే అనే వ్యక్తి తన ఎలక్ట్రిక్ స్కూటర్ పనిచేయకపోవడంతో గాడిదకు కట్టేసి ఊరేగించిన వీడియో ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది. ఈ సందర్భంగా అతను కంపెనీని నమ్మొద్దంటూ ప్లకార్డులను సైతం ప్రదర్శించాడు. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసిన ఆరు రోజులకే అది చెడిపోయిందని, ఎన్ని సార్లు కంప్లైంట్ చేసినా కంపెనీ పట్టించుకోవడంలేదన్నాడు. అందువల్ల తన స్కూటర్ను గాడిదకు కట్టి.. ఆ సంస్థను నమ్మవద్దంటూ ఊరేగించానని తెలిపాడు. కాగా సచిన్ 2021 సెప్టెంబర్లో స్కూటర్ను బుక్ చేయగా.. మార్చి 24న డెలవరీ అయింది. అయితే ఆరు రోజులకే చెడిపోవడంతో కంపెనీని సంప్రదించాడు. సదరు కంపెనీ మెకానిక్ తనిఖీ చేసినా కూడా పనిచేయడం లేదని సచిన్ తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Also read:
Viral Video: వ్యాన్కు వేలాడుతూ పాము షికారు.. వీడియో చూస్తూ ఫ్యూజులు ఔట్..!
Telangana Group 1: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేసింది.. పూర్తి వివరాలివే..
Andhra Pradesh: అనిల్ ఇంటికి వెళ్లిన మంత్రి కాకాని.. కలిసిన చేతులు.. కలవని చూపులు..!