Viral: సీతాఫలం మొక్క నాటేందుకు గుంత తవ్వుతుండగా బయటపడిన గుహ.. లోపల..
తవ్వకాల్లో ఇప్పటివరకు పురాతన విగ్రహాలు.. నిధి నిక్షేపాలు బయటపడటం చూశాం. కానీ కర్ణాటకలో ఏకంగా ఓ గుహే బయల్పడింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Karnataka: కర్ణాటకలోని సుల్లియా జిల్లాలో ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. కడబ(kadaba) తాలూకాలోని ఎడమమంగళ గ్రామం(Edamangala village)లో కల్లెంబి విశ్వనాథగౌడ్కు చెందిన స్థలంలో సీతాఫలం మొక్క నాటేందుకు గుంత తవ్వుతుండగా ఏకంగా పురాతన గుహ బయటపడింది. గడ్డపారతో మట్టి తవ్వుతుండగా.. భూమిలోని ఒకవైపు భాగం ఉర్లిపోయి గుహ లాంటి నిర్మాణం కనిపించింది. దాని లోపల నిశితంగా పరిశీలించగా వివిధ ఆకృతుల్లో ఉన్న మట్టి కుండలు, గిన్నెలు, చిన్న పాత్రల అవశేషాలు కనిపించాయి. గుహలో రెండు వేర్వేరు గదులు ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఉడిపి శిర్వాలోని MSRS కళాశాలకు చెందిన పురావస్తు శాస్త్రవేత్త ప్రొఫెసర్ టి మురుగేశి నేతృత్వంలోని టీమ్ ఈ బయల్పడిన గుహ నిర్మాణంతో పాటు వెలికితీసిన పాత్రలను అధ్యయనం చేస్తోంది. క్షుణ్ణంగా శాస్త్రీయ పరీక్షలు జరిపిన తర్వాత మాత్రమే వాటి మూలానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పూర్వకాలంలో భూమి లోపల చిన్న చిన్న గుహలను ఏర్పాటు చేసి వివిధ వస్తువులు పాతిపెట్టేవారని స్థానికులు చెబుతున్నారు. ఈ గుహకు గురించి సమాచారం తెలిసిన వెంటనే.. దాన్ని తిలకించేందుకు స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. (Source)
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి