పారామిలటరీ బలగాల్లోకి ట్రాన్స్జెండర్లు..!
ట్రాన్స్జెండర్లను పారా మిలటరీ బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్లుగా నియమించే అంశాన్ని సెంట్రల్ గవర్నమెంట్ తీవ్రంగా పరిశీలిస్తోంది. వారి ఎంపికకు సంబంధించి వైఖరి ఏంటో తెలపాలని సీఏపీఎఫ్ బలగాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరింది.
ట్రాన్స్జెండర్లను పారా మిలటరీ బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్లుగా నియమించే అంశాన్ని సెంట్రల్ గవర్నమెంట్ తీవ్రంగా పరిశీలిస్తోంది. వారి ఎంపికకు సంబంధించి వైఖరి ఏంటో తెలపాలని సీఏపీఎఫ్ బలగాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరింది. ఐటీబీపీ, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఎస్ఎస్బీ విభాగాల్లో ట్రాన్స్జెండర్లను నియమించడంపై కేంద్రం చాన్నాళ్ల నుంచి ఫోకస్ పెట్టింది. వారి నియామకాల విధివిధానాలు, ప్రణాళికలు ఎలా ఉండాలో తెలపాలని సీఏపీఎఫ్లను తాజాగా కోరింది.
‘1986-87లో మహిళలు రక్షణ దళాల్లో చేరినప్పుడు ఇలాంటి సమస్యలే ఎదురయ్యాయి. ఒక వ్యక్తి శారీరకంగా ఫిట్ గా ఉంటే లింగభేదం అసలు సమస్యే కాదు. కాలంతో పాటే మనమూ ముందుకెళ్లాలి’ అని కశ్మీర్ లోయలోని సీఆర్పీపీఎఫ్ ఆఫీసర్ పేర్కొన్నారు. ‘ఒకవేళ వారిని కూడా తీసుకుంటే.. అత్యంత ఎత్తైన బార్డర్ ఏరియాల్లో గస్తీ కాయాలి, పశ్చిమ సరిహద్దుల్లోని పాకిస్థాన్ ఆర్మీపై పోరాటాలకు సన్నంద్దంగా ఉండాలి. కాశ్మీర్లో టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడాలి’ అని ఈశాన్య భారతంలోని మరో అధికారి అభిప్రాయపడ్డారు. ట్రాన్స్జెండర్లపై అపోహలు తొలగేందుకు ఇది మంచి అవకాశమని ఓ రిటైర్డ్ ఆర్మీ అధికారి తెలిపారు.