ఆన్లైన్ కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడుతున్న వారికి ట్రాయ్ హెచ్చరిక..!
ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో.. ఎక్కువ మంది ఇతరులతో మాట్లాడేందుకు ఫోన్ కాల్స్కు బదులుగా ఆన్లైన్ యాప్స్ ద్వారా కూడా కాల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆన్లైన్ యాప్స్ వినియోగం కూడా భారీగా పెరిగింది. అయితే ఈ యాప్స్ యూజ్ చేసే సమయంలో వినియోగదారులు అనేక జాగ్రత్తలు పాటించాలని ట్రాయ్ హెచ్చరిస్తోంది. ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా అధిక బిల్లులు రావడం ఖాయమని.. కాబట్టి ఆన్లైన్ కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆన్ లైన్ కాన్ఫరెన్స్ […]
ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో.. ఎక్కువ మంది ఇతరులతో మాట్లాడేందుకు ఫోన్ కాల్స్కు బదులుగా ఆన్లైన్ యాప్స్ ద్వారా కూడా కాల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆన్లైన్ యాప్స్ వినియోగం కూడా భారీగా పెరిగింది. అయితే ఈ యాప్స్ యూజ్ చేసే సమయంలో వినియోగదారులు అనేక జాగ్రత్తలు పాటించాలని ట్రాయ్ హెచ్చరిస్తోంది. ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా అధిక బిల్లులు రావడం ఖాయమని.. కాబట్టి ఆన్లైన్ కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఆన్ లైన్ కాన్ఫరెన్స్ యాప్లను ఉపయోగించే వారు.. పొరపాటున ఇంటర్నేషనల్ నంబర్లకు కాల్ చేస్తున్నారని.. అలా చేయడం ద్వారా.. వారి నెలవారి బిల్లులు చూసి ఖంగుతింటున్నారని ట్రాయ్ తెలిపింది. ఇలా ఇంటర్నేషనల్ కాల్స్ చేసిన వారికి అధిక మొత్తంలో బిల్లులు రావడం గమనించినట్లు తెలిపింది. కస్టమర్ కేర్ సెంటర్ల కోసం.. కొన్ని యాప్లు ప్రీమియం నంబర్లు, ఇంటర్నేషనల్ నంబర్లు కూడా ఇస్తున్నాయని గుర్తించినట్లు ట్రాయ్ పేర్కొంది.
అయితే ఈ కాన్ఫరెన్స్ యాప్ల ద్వారా.. ఇంటర్నేషనల్ నంబర్లకు కాల్స్ చేస్తే.. ఐఎస్డీ టారిఫ్ల ప్రకారం ధరలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. కాబట్టి ముందుగా యాప్ల టర్మ్స్ అండ్ కండిషన్స్ పూర్తిగా చదివి.. వాటిని ఉపయోగించాలని సలహ ఇచ్చింది.
TRAI issues Advisory to public for exercising due care while joining online conference platforms through audio callshttps://t.co/zNUScerF3L
— TRAI (@TRAI) May 11, 2020