జగ్గారెడ్డి, ఈసీపై ఉత్తమ్ ఆగ్రహం..
గాంధీభవన్లో సీనియర్ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ వేయనున్న కాంగ్రెస్ పార్టీ. కాగా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటర్ల జాబితాలో స్పష్టత లేకున్నా.. ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తోందన్నారు. ప్రజలను ఎన్నికల అధికారి రజత్కుమార్ తప్పుదోవ పట్టించారని ఆరోపించారు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్. ఓ వైపు న్యాయ పోరాటం చేస్తూనే.. మరోవైపు బలమైన అభ్యర్థులనే ఎంపిక చేస్తామని చెప్పారు. అలాగే.. ఎమ్మెల్సీ […]
గాంధీభవన్లో సీనియర్ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ వేయనున్న కాంగ్రెస్ పార్టీ. కాగా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటర్ల జాబితాలో స్పష్టత లేకున్నా.. ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తోందన్నారు. ప్రజలను ఎన్నికల అధికారి రజత్కుమార్ తప్పుదోవ పట్టించారని ఆరోపించారు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్. ఓ వైపు న్యాయ పోరాటం చేస్తూనే.. మరోవైపు బలమైన అభ్యర్థులనే ఎంపిక చేస్తామని చెప్పారు. అలాగే.. ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతను డీసీసీలకు అప్పగించినట్లు స్పష్టం చేశారు ఉత్తమ్.
అయితే.. మరోవైపు జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రాబోయే కాలంలో గాంధీభవన్లో ఉంటానో… లేక తెలంగాణ భవన్లో ఉంటానోనని.. వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి.