రాజగోపాల్ రెడ్డి కామెంట్స్పై టీపీసీసీలో హాట్హాట్గా చర్చ
నల్గొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్గా తీసుకుందా..? ఇవాళ ఢిల్లీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు..? దీనిపై కోమటి రెడ్డి రియాక్షన్ ఎలా ఉండబోతోంది..? అన్నదానిపై తెలంగాణ కాంగ్రెస్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ నాయకత్వంపై రాజగోపాల్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్చించేందుకు సోమవారం టీపీసీసీ క్రమశిక్షణా సంఘం గాంధీభవన్లో సమావేశమైంది. కాంగ్రాస్ నాయకత్వానికి వ్యతిరేకంగా, బీజేపీకి అనుకూలంగానూ రాజగోపాల్ చేసిన […]
నల్గొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్గా తీసుకుందా..? ఇవాళ ఢిల్లీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు..? దీనిపై కోమటి రెడ్డి రియాక్షన్ ఎలా ఉండబోతోంది..? అన్నదానిపై తెలంగాణ కాంగ్రెస్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ నాయకత్వంపై రాజగోపాల్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్చించేందుకు సోమవారం టీపీసీసీ క్రమశిక్షణా సంఘం గాంధీభవన్లో సమావేశమైంది. కాంగ్రాస్ నాయకత్వానికి వ్యతిరేకంగా, బీజేపీకి అనుకూలంగానూ రాజగోపాల్ చేసిన కామెంట్స్కు సంబంధించి పేపర్ క్లిప్పింగ్స్, వీడియో క్లిప్పింగ్స్ను పార్టీ క్రమశిక్షణా సంఘం పరిశీలించింది.
క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ కోదండ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాజగోపాల్కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలా వద్దా అనే విషయంపై క్లారిటీ తీసుకునేందుకు యత్నంచారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న టీ.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా కూడా ఢిల్లీలోనే ఉన్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.