టాక్సిక్ ఆసిడ్స్ ప్రభావంతో సికింద్రాబాద్ జీవనం నరకం!

కాప్రా, హుస్సేన్ సాగర్ చెరువులు మురుగునీటితో నిండిపోయాయి. కాప్రా చెరువులోకి ఎగువ ప్రాంతంలోని మురుగు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయనలతో  జలాలు విషపూరితంగా మారుతున్నాయి. కాప్రా, నాగారం ప్రాంతంలోని మురుగునీరు, చర్లపల్లి, కుషాయిగూడ పారిశ్రామికవాడల్లోని రసాయనాలు ఈ చెరువులోకి వచ్చి చేరుతున్నాయి. దీంతో ఈ చెరువు పూర్తిగా కలుషితమైంది. చెరువులోని నీటిని చేతితో తాకలేని పరిస్థితి. చెరువు పరిసర ప్రాంతంలోకి ప్రవేశించగానే ముక్కు పుటాలు అదిరేంత దుర్వాసన వెలువడుతోంది. ఈ చెరువు నిరంతరం మురుగునీటితో నిండి ఉంటుంది. […]

టాక్సిక్ ఆసిడ్స్ ప్రభావంతో సికింద్రాబాద్ జీవనం నరకం!
Follow us

| Edited By:

Updated on: Nov 12, 2019 | 5:45 PM

కాప్రా, హుస్సేన్ సాగర్ చెరువులు మురుగునీటితో నిండిపోయాయి. కాప్రా చెరువులోకి ఎగువ ప్రాంతంలోని మురుగు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయనలతో  జలాలు విషపూరితంగా మారుతున్నాయి. కాప్రా, నాగారం ప్రాంతంలోని మురుగునీరు, చర్లపల్లి, కుషాయిగూడ పారిశ్రామికవాడల్లోని రసాయనాలు ఈ చెరువులోకి వచ్చి చేరుతున్నాయి. దీంతో ఈ చెరువు పూర్తిగా కలుషితమైంది. చెరువులోని నీటిని చేతితో తాకలేని పరిస్థితి. చెరువు పరిసర ప్రాంతంలోకి ప్రవేశించగానే ముక్కు పుటాలు అదిరేంత దుర్వాసన వెలువడుతోంది. ఈ చెరువు నిరంతరం మురుగునీటితో నిండి ఉంటుంది. ఒకప్పుడు తాగునీరు అందించిన చెరువు నీరు నలుపు రంగులోకి మారింది. ఆ నీటిని మూగ జీవాలు తాగినా మృతి చెందే పరిస్థితి నెలకొంది. చెరువంతా ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండి ఉంది.

వర్షాకాలం వస్తే చాలు కీసర మండలంలోని 10 గ్రామాల ప్రజలు దుర్వాసనతో ఇబ్బందులు పడాల్సిందే. చెరువులోని నీరంతా కూడా కాలనీల్లో చేరడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. చెరువులన్నీ కలుషితం కాకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఈ ప్రాంతానికి చెందిన పలువురు ప్రజలు కోరుతున్నారు. దీనికి తోడు దోమల బెదడ అధికమైంది. దోమల ప్రభావంతో చెరువు సమీప ప్రాంత ప్రజలు తరచూ అంటు వ్యాధుల బారిన పడుతున్నారు. చెరువులోకి మురుగునీరు రాకుండా ప్రత్యేక పైపులైను ఏర్పాటు చేయాలి. చెరువులోకి కేవలం వర్షపు నీరు వచ్చి చేరేలా అధికారులు చర్యలు చేపట్టాలి.

హుస్సేన్‌సాగర్‌లోకి మురుగునీరుతో పాటు పెద్ద మొత్తంలో చెత్తా చెదారం వచ్చి చేరుతోంది. తీరంలోనే పేరుకుపోయిన చెత్తా చెదారం కుళ్లిపోయి ఎండా కాలంలో భరించలేని దుర్వాసన వస్తోంది. ఈ విషయం అధికారులకు తెలిసినా అక్కడ చేపట్టిన చర్యలు శూన్యం. ముఖ్యంగా వేసవిలో సెలవులు ఉండడంతో నగరం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలోనే సందర్శకులు కుటుంబాలతో సహా ఇక్కడికి విచ్చేస్తుంటారు. సందర్శకుల తాకిడితో ఆదాయం పెరిగే అవకాశం ఉన్నా, పర్యాటకులకు హాయిగా ఉండేలా ఏర్పాట్లు చేసిన దాఖలాలు లేవు.

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..