గాయకుడు కారుణ్య ఇంట విషాదం
ప్రముఖ గాయకుడు, ఇండియన్ ఐడల్ రన్నరప్ కారుణ్య ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి శనివారం కన్నుమూశారు. మీర్పేట కార్పోరేషన్ పరిథిలోని బాలాపూర్ చౌరస్తా సమీపంలోని త్రివేణినగర్లో నివాసముంటున్న కారుణ్య తల్లి జానకి(70) కొద్ది రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు.
ప్రముఖ గాయకుడు, ఇండియన్ ఐడల్ రన్నరప్ కారుణ్య ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి శనివారం కన్నుమూశారు. మీర్పేట కార్పోరేషన్ పరిథిలోని బాలాపూర్ చౌరస్తా సమీపంలోని త్రివేణినగర్లో నివాసముంటున్న కారుణ్య తల్లి జానకి(70) కొద్ది రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. కొద్దిరోజులుగా చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో తుది శ్వాస విడిచారు. జానకి.. కేంద్ర రక్షణ రంగ సంస్థ బీడీఎల్లో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. సైదాబాద్ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించగా, కొద్ది మంది బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కారుణ్య తండ్రి మధు సైతం డిఫెన్స్లోనే పనిచేసి రిటైర్ అయ్యారు. కారుణ్య తల్లి మరణించిన విషయం తెలుసుకున్న సినీ రంగ ప్రముఖులు పలువురు కారుణకి ఫోన్లో ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.