సీఎం జగన్తో సినీ ప్రముఖుల సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు ఈ నెల 9న సమావేశం కానున్నారు. చిరంజీవి నేతృత్వంలో దర్శకులు, నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు ఈ భేటీలో పాల్గొననున్నారు. ఈ సమావేశ వివరాలను నిర్మాత సి.కళ్యాణ్ మీడియాకు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు ఈ నెల 9న సమావేశం కానున్నారు. చిరంజీవి నేతృత్వంలో దర్శకులు, నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు ఈ భేటీలో పాల్గొననున్నారు. ఈ సమావేశ వివరాలను నిర్మాత సి.కళ్యాణ్ మీడియాకు వెల్లడించారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి గ్రూపులు లేవని అందరం కలిసికట్టుగా సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం పనిచేస్తామని అన్నారు. బాలకృష్ణను ఈ సమావేశానికి ఆహ్వానించినట్లుగా చెప్పారు. పుట్టిన రోజు వేడుకల వల్ల హాజరు కాలేనని బాలకృష్ణ తెలిపారని కళ్యాణ్ వెల్లడించారు. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి, చిత్రీకరణ అనుమతులపై సీఎంతో చర్చిస్తామని తెలిపారు.
ఇటీవల చిరంజీవి నేతృత్వంలో సినీ ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై చర్చించారు. లాక్ డౌన్ నేపథ్యంలో సినిమా షూటింగ్లకు అనుమతి ఇవ్వాలని కోరగా.. సీఎం సానుకూలంగా స్పందించారు. ఇవే అంశాలపై ఏపీ ముఖ్యమంత్రితో కూడా చర్చించనున్నారు.