నేడు సీఈసీని కలవనున్న వైసీపీ నేతలు
హైదరాబాద్: వైసీపీ నేతలు నేడు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ను కలవనున్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి, మాజీ ఎంపీ బొత్స సత్యనారాయణతో పాటు పలువురు సీనియర్ నేతల బృందం ఎన్నికల కమిషన్ను సాయంత్రం 5 గంటలకు కలుసుకుంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలు, అవాంచనీయ సంఘటనలకు టీడీపీ కారణమంటూ వారు ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై, కార్యకర్తలపై పోలింగ్ రోజున, పోలింగ్ అనంతరం జరిగిన దాడులను ఈ సందర్భంగా […]
హైదరాబాద్: వైసీపీ నేతలు నేడు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ను కలవనున్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి, మాజీ ఎంపీ బొత్స సత్యనారాయణతో పాటు పలువురు సీనియర్ నేతల బృందం ఎన్నికల కమిషన్ను సాయంత్రం 5 గంటలకు కలుసుకుంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలు, అవాంచనీయ సంఘటనలకు టీడీపీ కారణమంటూ వారు ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై, కార్యకర్తలపై పోలింగ్ రోజున, పోలింగ్ అనంతరం జరిగిన దాడులను ఈ సందర్భంగా కమిషన్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.