బ్రేకింగ్.. రికార్డులు బ్రేక్ చేస్తున్న బంగారం ధరలు..
పసిడి పరుగులు అందనంత ఎత్తుకు ఎగురుతోంది. రెక్కలు వచ్చి నింగిని తాకుతూ రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది. తాజాగా మంగళవారం నాడు ఆల్ టైం రికార్డును నమోదు చేసింది. ప్రస్తుతం కరోనా టైంలో కూడా ఎవరూ..
పసిడి పరుగులు అందనంత ఎత్తుకు ఎగురుతోంది. రెక్కలు వచ్చి నింగిని తాకుతూ రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది. తాజాగా మంగళవారం నాడు ఆల్ టైం రికార్డును నమోదు చేసింది. ప్రస్తుతం కరోనా టైంలో కూడా ఎవరూ ఊహించని విధంగా రూ.51 వేల మార్క్ను దాటేసింది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.51,370 నుంచి 51,380కి చేరింది. మంగళవారం ఉన్న ధరకంటే రూ. 800కు పైగా పెరిగింది.
ఇక సిల్వర్ కూడా బంగారం కంటే మరింత దూకుడు ప్రదర్శించింది. బులియన్ మార్కెట్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో ధర పలికింది. బుధవారం నాడు కిలో వెండిపై రూ.2,250 పెరిగింది. దీంతో ఒక కిలో వెండి ధర రూ.55,400కి చేరింది. మార్కెట్లో ఇప్పటి వరకు ఇదే అత్యధిక ధర కావడం.. అది కూడా కరోనా కాలంలో పెరగడం విశేషం.