మరో టీఎంసీ ఎమ్మెల్యే కరోనాతో మృతి!
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో సోమవారం మరో ఎమ్మెల్యే కరోనాతో మరణించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సమరేష్ దాస్(76)
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో సోమవారం మరో ఎమ్మెల్యే కరోనాతో మరణించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సమరేష్ దాస్(76) నేటి ఉదయం కరోనాతో మరణించారు. ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా ఈగ్రా అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన సమరేష్ దాస్ కరోనాతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో కరోనాతో మరణించిన ఎమ్మెల్యేల సంఖ్య రెండుకు చేరింది. ఎమ్మెల్యే సమరేష్ దాస్ మృతి తీరని లోటని, ఆయనకు సీఎం మమతాబెనర్జీ సంతాపం తెలిపారు.
Read More:
సోమాలియాలో ఉగ్రదాడి.. 17 మంది మృతి..!