ముక్కోటి ఏకాదశికి.. 10 రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం!
తిరుమల పుణ్యక్షేత్రం వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం విశేషంగా ముస్తాబవుతోంది. టీటీడీ అధికారులు ఈ సారి వైకుంఠ ఏకాదశి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి గరుడసేవ అత్యంత వైభవంగా జరుగుతుంది. తరువాత వైకుంఠ ఏకాదశికే భక్తులు ఎక్కువగా తిరుమలకు చేరుకుంటారు. ఈ సారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శుభవార్త తెలుపనున్నారు. వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారి దర్శనం కోసం భక్తజనం తహతహలాడుతుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు […]
తిరుమల పుణ్యక్షేత్రం వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం విశేషంగా ముస్తాబవుతోంది. టీటీడీ అధికారులు ఈ సారి వైకుంఠ ఏకాదశి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి గరుడసేవ అత్యంత వైభవంగా జరుగుతుంది. తరువాత వైకుంఠ ఏకాదశికే భక్తులు ఎక్కువగా తిరుమలకు చేరుకుంటారు. ఈ సారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శుభవార్త తెలుపనున్నారు.
వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారి దర్శనం కోసం భక్తజనం తహతహలాడుతుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఇప్పటివరకు కేవలం వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లోనే శ్రీవారిని వైకుంఠ మార్గం ద్వారా దర్శించుకునే వీలుంది. అయితే భక్తులు అపరిమిత సంఖ్యలో రావడం వల్ల, చాలా మంది భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం లభించడంలేదు. ఈ క్రమంలో ఇకపై ఏడాదికి పదిరోజులు పాటు స్వామివారిని వైకుంఠ మార్గం ద్వారా దర్శించుకునే ప్రతిపాదనలను టీటీడీ సిద్దం చేస్తోంది. ఈ రోజుల్లో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే యాత్రికుల కోసం అధికారులు ఈసారి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పది రోజుల దర్శనానికి తిరుమల దేవస్థానం ఆగమ సలహామండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా.. పాలకమండలి ఆమోదం తెలపాల్సి ఉంది. పాలకవర్గ మీటింగ్లో మెజార్టీ సభ్యులు ఆమోదం తెలిపితే ఈ ఏడాది నుంచే ఈ విధానం అందుబాటులోకి రానుంది.