టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీకెక్కిన మోదీ
న్యూయార్క్: భారత్ ఎన్నికల కోలాహలం ముగింపు దశకు వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంమైన భారత్లో సార్వత్రిక ఎన్నికలు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందుకే అమెరికాకు చెందిన ప్రఖ్యాత వీక్లీ మ్యాగజైన్ ‘టైమ్’ కూడా ఈసారి భారత ఎన్నికలపై ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ ఎడిషన్ తీసుకొచ్చింది. దానిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటోను కవర్ పేజీపై ప్రచురించింది. అయితే ఈ మ్యాగజైన్ కవర్ పేజీపై మోదీ ఫొటో పక్కన ‘ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్’ అంటూ వివాదాస్పద హెడ్లైన్ […]
న్యూయార్క్: భారత్ ఎన్నికల కోలాహలం ముగింపు దశకు వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంమైన భారత్లో సార్వత్రిక ఎన్నికలు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందుకే అమెరికాకు చెందిన ప్రఖ్యాత వీక్లీ మ్యాగజైన్ ‘టైమ్’ కూడా ఈసారి భారత ఎన్నికలపై ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ ఎడిషన్ తీసుకొచ్చింది. దానిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటోను కవర్ పేజీపై ప్రచురించింది.
అయితే ఈ మ్యాగజైన్ కవర్ పేజీపై మోదీ ఫొటో పక్కన ‘ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్’ అంటూ వివాదాస్పద హెడ్లైన్ రాసింది. దీంతో పాటు ‘మోదీ ది రిఫార్మర్’ అనే మరో పాజిటీవ్ హెడ్లైన్ కూడా ఇచ్చింది. మే 20, 2019న వెలువడే టైమ్ మ్యాగజైన్ యూరప్, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా, ఆసియా, దక్షిణ పసిఫిక్ అంతర్జాతీయ ఎడిషన్లలో మోదీ కవర్స్టోరీ ప్రచురించింది. ‘ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్’ కథనాన్ని ప్రముఖ భారత జర్నలిస్టు తవ్లీన్ సింగ్ కుమారుడు ఆతిష్ తసీర్ రచించారు. మరో కథనం ‘మోదీ ది రిఫార్మర్’ను ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ యురేసియా గ్రూప్ ఫౌండర్ ఇయాన్ బ్రెమర్ రాశారు. మ్యాగజైన్ లోపల ‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మరో ఐదేళ్లు మోదీ ప్రభుత్వం వస్తుందా?’ అనే పేరుతో తసీర్ కథనం రాశారు.
ఇందులో మోదీ ప్రవేశపెట్టిన పథకాలు, జీఎస్టీ, ఆధార్ వినియోగం వంటి అంశాలను ప్రస్తావించారు. అంతేగాక.. బలహీనమైన ప్రతిపక్షం ఉండటం మోదీకి అదృష్టమంటూ రచయిత పేర్కొన్నారు. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలు మినహా ఇంకేమీ చేయట్లేదని దుయ్యబట్టారు. కాగా.. గతంలోనూ మోదీ చిత్రాన్ని టైమ్ మ్యాగజైన్ కవర్ ఫొటోపై ప్రచురించిన సందర్భాలున్నాయి.