టిక్ టాక్ బ్యాన్.. మాతృ సంస్థకు 6 బిలియన్ డాలర్ల లాస్ ?
చైనాకు చెందిన టిక్ టాక్ యాప్ తో బాటు 58 ఇతర యాప్ లను భారత ప్రభుత్వం బ్యాన్ చేయడంతో ఆ దేశంలోఈ యాప్ లను నిర్వహిస్తున్న బైట్ డ్యాన్స్ కి దాదాపు 6 బిలియన్ డాలర్ల నష్టం వస్తుందని భావిస్తున్నారు. ఇండియా బ్యాన్ చేసిన..
చైనాకు చెందిన టిక్ టాక్ యాప్ తో బాటు 58 ఇతర యాప్ లను భారత ప్రభుత్వం బ్యాన్ చేయడంతో ఆ దేశంలోఈ యాప్ లను నిర్వహిస్తున్న బైట్ డ్యాన్స్ కి దాదాపు 6 బిలియన్ డాలర్ల నష్టం వస్తుందని భావిస్తున్నారు. ఇండియా బ్యాన్ చేసిన ఇతర యాప్ లన్నింటినీ కలిపి పోలిస్తే.. ఆరు బిలియన్ డాలర్లు అత్యధికమని భావిస్తున్నారు. భారత, చైనా దళాల మధ్య గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో.. ప్రభుత్వం ఈ చర్య తీసుకున్న సంగతి తెలిసిందే. చైనా యాప్ లను మన ప్రభుత్వం నిషేధించిన ప్రభావం బైట్ డ్యాన్స్ పై పడింది. స్థానికంగా ఉన్న టెక్నాలజీ కంపెనీలు దీని పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ఇతర దేశాలతో చైనాకు గల సంబంధాలు ఈ సంస్థ కారణంగా క్షీణిస్తున్నాయని అవి భావిస్తున్నాయి. ముఖ్యంగా టిక్ టాక్ బ్యాన్…. దీనికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాపులారిటీకి పెద్ద దెబ్బ అంటున్నారు. ఇండియాలో టిక్ టాక్ కి కోట్లాది యూజర్లు ఉన్నారు. కాగా చైనా లోని బైట్ డ్యాన్స్ తరఫున ఇండియాలో సుమారు రెండువేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.